తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన బొంబాయి, రోజా సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హ్యాండ్సమ్ హీరో అరవింద స్వామి. మణిరత్నం తన సినిమా దళపతి లో అరవింద్ స్వామిని వెండితెరకు పరిచయం చేశాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా పెద్దగా గుర్తింపు రాలేదు..దాంతో సినిమాలకు చాలా దూరంగా ఊంటూ వచ్చారు. హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ నటించిన ‘కడలి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే సెకండ్ ఇన్నింగ్ విలన్ గా మొదలు పెట్టిన అరవింద స్వామి ‘తన్నివొరున్’ తెలుగు లో ధృవ ఈ రెండు సినిమాలో విలన్ గా నటించాడు.
ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో .. మణిరత్నం దర్శకత్వంలో 'చక్క చివంత వానం' అనే తమిళ సినిమా రూపొందుతోంది. తెలుగులో ఈ సినిమాకి 'నవాబ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి అరవింద్ స్వామి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. మణిరత్నం సినిమాల్లో నటిస్తే చాలనుకుంటారు హీరోలు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా.. జాతీయ స్థాయిలో మణిరత్నం సినిమాలకు క్రేజ్ ఉంటుంది. కానీ, గత కొంతకాలం పాటు మణిరత్నం నుంచి వచ్చే సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి.
మునుపటి మణిరత్నాన్ని తలపించేలా, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా ‘నవాబ్’ సినిమా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబులు అన్నదమ్ములుగా నటిస్తున్నారని, వీరి మధ్య వచ్చే సంఘర్షణలే సినిమాకు కీలకం అని తెలుస్తోంది. ఈ సినిమాలో జ్యోతిక, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. విలక్షణమైన పాత్రలతో .. అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. మణిరత్నం సినిమాలను ఇష్టపడే అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.