తెలుగు ఇండస్ట్రీలో స్టార్ వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు దగ్గుబాటి వెంకటేష్ ‘కలియుగపాండవులు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మొదట్లో యాక్షన్ తరహా చిత్రాలకు ప్రాధాన్య ఇచ్చిన వెంకటేష్ తర్వాత ఫ్యామిలీ, కామెడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు.  గత కొంత కాలంగా వెంకటేష్ ఎక్కువ శాతం మల్టీస్టారర్ మూవీస్ లో నటిస్తున్నాడు. 
Image result for kaliyuga pandavulu movie
స్టార్ ఇమేజ్ ని పక్కన బెట్టి కుర్రహీరోల సైతం మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు.  తాజాగా  కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ గా మారిన విక్టరీ వెంకటేశ్ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి నేటికి 32 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇక ఇండస్ట్రీలోకి తన ప్రస్థాన్ ఇప్పటి ఎంతో హ్యాపీగా సాగిందని..ఓ భావోద్వేగ పోస్ట్ ను వెంకటేశ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ రోజు తాను నటుడిగా జన్మించానని చెప్పారు.  విక్టరీ వెంకటేష్ తన ఫేస్ బుక్ లో ఇలా పోస్ట్ చేశారు.
Image result for daggubati venkatesh facebook
 ‘‘నేను తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 32 ఏళ్లు అవుతోంది. 1986, ఆగస్టు 14న నా తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ విడుదలైంది. ఈ రోజే నేను నటుడిగా జన్మించాను. గత 32 సంవత్సరాలుగా మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతూనే ఉన్నా. అందుకు నేనెంతో అదృష్టవంతుడిని. నేను నా సినీ ప్రయాణంలో మరో అడుగు ముందుకు వేయబోతున్నాను. దీని ద్వారా మీ అందరికీ మరింత దగ్గరవుతాను. త్వరలోనే మీకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నా’’ అంటూ ఎంతో  భావోద్వేగ పోస్ట్ పెట్టారు.  దీని ఫ్యాన్స్ నుంచి ఎంతో పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: