సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సినీతారలపై బయోపిక్ లు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు లో మహానటి, బాలీవుడ్ లో సంజు లు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇక బయోపిక్ల పరంపరలో మరో సినిమా రాబోతోంది. ఒకప్పటి అందాల తార, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్కి రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే జయలలిత బయోపిక్ అంటే అదంత ఈజీ కాదు. జయలలిత బయోపిక్ ను ఎవరైనా తీస్తామంటే దాని పై జయ అభిమానులే మొదట అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమా తీవ్ర వివాదాలను రేపే అవకాశం ఉంది.
అయితే జయలలిత మరణించిన వెంటనే ఒకట్రెండు బయోపిక్లు ప్రకటించారు. రాంగోపాల్వర్మ, దాసరి నారాయణరావు లాంటి దగ్గజాలు జయలలిత సినిమా తీయడానికి ఉత్సాహం చూపించారు..కానీ వర్మ వేరే సినిమా బిజీలో ఆ విషయాన్ని పక్కనబెట్టగా దర్శక రత్న దాసరి నారాయణ రావు ఇప్పుడు మన మద్యన లేరు. దాంతో ఇక జయలలిత బయోపిక్ వస్తుందన్న విషయంపై అనుమానాలు వచ్చాయి.
ఇక జయలలిత బయోపిక్ చూడలేమనుకుంటున్న తరుణంలో… ఈ ప్రాజెక్టుకి అంకురార్పణ జరగబోతున్నట్టు తెలిసింది. సి.కల్యాణ్ నిర్మాతగా ఈ బయోపిక్ని తెరకెక్కిస్తారని, తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.
దీనికి ఊతం ఇస్తూ..ఈ మద్య `లక్ష్మి` ఆడియో వేడుకలో `త్వరలో ఓ సంచలనాత్మక చిత్రం చేయబోతున్నా` అని కల్యాణ్ ప్రకటించారు. అంతే కాదు జయలలిత పాత్రలో ప్రముఖ స్టార్ హీరోయిన్ నటించబోతుందట.. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఈ సినిమాని విడుదల చేస్తారని తెలుస్తోంది.