దిల్ రాజు నిర్మించిన శ్రీనివాస కళ్యాణం మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను స్వంతం చేసుకున్నది దీనితో చిత్ర యూనిట్ పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాసలు ఆయినాయి. అయితే దిల్ రాజు ప్రెస్ మీట్ అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. దిల్ రాజు మాట్లాడుతూ  సినిమా రిలీజైంది. మొదటి ఆటకు మొత్తం పాజిటివ్ వైబ్రేషన్ కనిపించింది. నేను, సతీశ్ వేగేశ్న ఐమాక్స్ కు వెళ్లాం. అంతా బాగుందన్నారు. తర్వాత సుదర్శన్ కు వెళ్లాం. అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్. కానీ ఏమైందో ఏమో మ్యాట్నీ నుంచి సినిమా పడిపోయింది.

Image result for srinivasa kalyanam

రివ్యూస్ రాసేవాళ్లకు సినిమా నచ్చలేదు. అప్పటికే సినిమా చూసిన యూత్ కూడా సోషల్ మీడియాలో నెగెటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఇలా సినిమా గురించి ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు దిల్ రాజు. రిలీజైన రెండో రోజుకే వసూళ్లు దారణంగా పడిపోయాయని చెప్పిన దిల్ రాజు, శని-ఆదివారాలు మాత్రం ఊపందుకుందని చెబుతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ఇప్పటికీ తనను అయోమయానికి గురిచేస్తోందంటున్నాడు. మరోవైపు హీరో నితిన్ అయితే ఏకంగా సినిమా ఆడట్లేదని ప్రకటించాడు. 

Image result for srinivasa kalyanam

ఈ సినిమాకు ఫ్యామిలీస్ నుంచి టాక్ అద్భుతంగా ఉంది. అయితే గుర్తింపు మాత్రం రావట్లేదు. రెస్పాన్స్ బాగుంది. కాకపోతే గుర్తింపు రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, నెక్ట్స్ ఇయర్ వస్తుందా, 5 ఏళ్ల తర్వాత వస్తుందా అనేది చెప్పలేను. బట్ గుర్తింపు మాత్రం గ్యారెంటీగా వస్తుంది. ఇలా నితిన్, దిల్ రాజు మాత్రమేకాదు.. సక్సెస్ మీట్ లో దర్శకుడు, హీరోయిన్ కూడా దాదాపు ఇలానే మాట్లాడారు. సక్సెస్ మీట్ పెట్టి మరీ సినిమా ఆడట్లేదని అంగీకరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: