హీరో ప్రభాస్ గురించి మాట్లాడాలంటే బాహుబలికి ముందు తర్వాత అని ప్రస్థావించాల్సిందే. ఎందుకంటే టాలీవుడ్ జక్కన్న తెరకెక్కించిన బాహుబలి మూవీ చేయడానికి ముందు ఆయన ఓ టాలీవుడ్ హీరో మాత్రమే. కాని బాహుబలి రెండు పార్ట్ లు సాధించిన బంపర్ హిట్ తో రెబెల్ స్టార్ కాస్తా నేషనల్ స్టార్ అయిపోయాడు. అంతేకాకుండా యూత్ లో మోస్ట్ పాపులర్ హీరోగా మారిపోయాడు. 


దాంతో ప్రభాస్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ దర్శకులు కూడా కథలు రెడీ చేసేసుకున్నారు. ఇలా మూవీ షూటింగ్ పూర్తైందో లేదో ఈ యంగ్ హీరో ఇంటికి క్యూ కట్టేశారు. కాని ఈ నయా నేషనల్ స్టార్ మాత్రం చాలామందికి నో చెప్పేశాడట. ఇలా తిరస్కరించబడిన వారిలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ కూడా ఉన్నాడని బాలీవుడ్ టాక్. ఈయన బాహుబలిని మూవీని హిందీలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.


పద్మావత్ సినిమా తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీ ఎంత గొప్ప డైరెక్టరో అందరికి తెలిసిందే. ఈ మూవీలో షాహిద్ కపూర్ పోషించిన రావల్ సింగ్ రాజ్ పుత్ క్యారెక్టర్ కోసం ప్రభాస్ ని సంప్రదించాడట. అప్పటికే బాహుబలి పేరుతో దాదాపుగా ఐదేళ్ళ సమయం కేటాయించిన ప్రభాస్ మరోసారి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాకు పనిచేయలేనని తేల్చేశాడట. అప్పటికే ఒకే చెప్పిన సాహో సినిమాకే తన కాల్షీట్లు కేటాయించాడు.   


ప్రభాస్ నో చెప్పడంతో చేసేదేం లేక భన్సాలీ... షాహిద్ కపూర్ ని తన సినిమాలో పెట్టుకున్నాడని బీ టౌన్ లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకులను తిరస్కరించడం ప్రెజెంట్ అక్కడ హాట్ టాపిక్ అయిపోయింది. అంతేకాదు ఆ సినిమాలో విలన్ అయినా రన్ వీర్ సింగ్ కే ఎక్కువ స్కోప్ ఉంది. మరి అలాంటిది ప్రభాస్ ఒకవేళ ఆ పాత్ర చేసినా లాభం ఉండేది కాదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: