తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నిర్మాత గా పేరు తెచ్చుకున్నాడు అల్లు అరవిందు. ఎన్నో విజయవంతమైన సినిమాలను గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించి గొప్ప పేరు సంపాదించారు అయితే అల్లు అరవిందు నిర్మాణ రంగం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా అల్లు అరవింద్ నిర్మించిన గీతగోవిందం, సినిమాతో పాటు మరో మూడు సినిమాల రా పుటేజ్ తో టాలీవుడ్ గందరగోళం నెలకొంది.
పోలీసులు దొంగల్ని అదుపులోకి తీసుకున్నా..భవిష్యత్ సినిమా గురించి ఆలోచిస్తే గుండె ఝల్లుమంటుంది. అందుకే అల్లు అరవింద్ అంత మదన పడుతున్నట్లున్నారు. ఈ లీకుల వ్యవవహారం చూసి..భవిష్యత్ ను తలుచుకుని అరవింద్ సినిమాలు మానేస్తానంటున్నారు. ఇదే మాటను దిల్ రాజ్ కు చెప్పి బాధపడ్డారు. 45 ఏళ్ల నుంచి అరవింద్ సినిమా నిర్మాణ రంగంలో ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లలు చూసారు. అనుభవాన్ని మించినది మరొకటి ఉండదు.
నిర్మాణంలో రామానాయుడు తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు అరవింద్ సొంతం. 45 కెరీర్ లో ఎంతో మంది హీరోలతో సినిమాలు చేసారు. నవతరం హీరోల్ని ప్రోత్సహిస్తూ సినిమాలు తీస్తున్నారు. అంతటి దిగ్గజమే పైరీసి చూసి భయపడుతుందంటే? చిన్నసినిమాలు పైరసీకి గురైతే ఆ నిర్మాతల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించగలం. టాలీవుడ్ కు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు బాలీవుడ్ నే కాదు..టాలీవుడ్ కు ఆ సత్తా ఉందని బాహుబలి తో రుజువైంది. మరీ ఇలాంటి తరుణం లో అల్లు అరవిందు నిర్ణయం షాకింగ్ అని చెప్పాలి.