అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో ఓ బ్రాండ్ గా మారిన హీరో విజయ్ దేవరకొండ.. రెండు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో అంటే ఈమధ్య కాలంలో విజయ్ అనే చెప్పాలి. ఈరోజు గీతా గోవిందం అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజయ్ దేవరకొండ. పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు విపరీతమైన బజ్ ఏర్పడింది.


ప్రస్తుతం యువ హీరోల్లో విజయ్ మంచి ఫాంలో ఉన్నాడని చెప్పొచ్చు. దానికి తోడుగా గీతా గోవిందం సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తుంది. ఇక ప్రమోషన్స్ తో పిచ్చెక్కించేశారు. అందుకే సినిమాపై అందరు మాట్లాడేలా చేశారు. సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన నటించింది.


ఛలో సినిమాతో హిట్ అందుకున్న రష్మిక విజయ్ తో జోడి కట్టడం సినిమా టీజర్, ట్రైలర్ బాగుండటం సినిమాపై సూపర్ ఎక్సైట్మెంట్ కలిగించాయి. విజయ్ క్రేజ్ ను చూసుకునే డేర్ గా బుధవారం నాడు సినిమా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ నాలుగు రోజుల్లోనే మాక్సిమం రాబట్టేయొచ్చు.


సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఎక్కువ థియేటర్ లలో రిలీజ్ చేయడం కూడా ప్లస్ పాయింటే. మరి గీతా గోవిందం సినిమా విజయ్ కెరియర్ లో ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. విజయ్ తో పాటుగా రష్మికకు ఈ సినిమా పాజిటివ్ రిజల్ట్ చాలా అవసరం.



మరింత సమాచారం తెలుసుకోండి: