తెలుగు ఇండస్ట్రీలో రెడీ, దూకుడు, దుబాయ్ శీను లాంటి చిత్రాల్లో  కామెడీతో పాటు అద్భుతమైన యాక్షన్, ఎంట్రటైన్ మెంట్ అందించిన శ్రీను వైట్ల  ‘బ్రూస్ లీ’ చిత్రంతో బ్యాడ్ టైమ్ మొదలైంది.  ఆ తర్వాత వచ్చిన రెండు చిత్రాలు ఘోరంగా అపజయం పొందాయి.  దాంతో మనోడీ కెరీర్ పీక్ స్టేజ్ కి వెళ్లిపోవడంతో మరోసారి మాస్ మహరాజ రవితేజతో అద్భుతమైన కామెడీ జోనర్ చిత్రాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంథోనీ’.  రవితేజతోనే శ్రీనువైట్ల మ్యాజిక్ స్టార్ట్ అయ్యింది.. ఇప్పుడు మళ్లీ రవితేజతోనే ఈ దర్శకుడు రిటర్న్స్ అనిపించుకుంటాడా? అనేది ఆసక్తిగా మారింది.  దశాబ్దాల కిందటి సూపర్ హిట్ సినిమా టైటిల్‌ను వైట్ల వాడేస్తున్నాడు.  మాస్ మహారాజ రవితేజ, ఇలియానా జంటగా తెరకెక్కుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం నుండి తాజాగా కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు.

పోస్టర్ ని బట్టి చూస్తుంటే విభిన్నమైన లుక్ తో డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది.

త్రిభుజాకారం డిజైన్, ఒక మ్యాజికల్ రింగ్, రాజు-రాణి బొమ్మలు,రిటర్న్ గిఫ్ట్ అని ఇంగ్లిష్‌లో ప్రతి భుజానికీ రాయడం, టైటిల్ లోగోలోని ఆంటోనీ అనే పదంలో మరో డిజైన్.. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉండీ లేనట్టుగా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. టైటిల్ లోగోతో పాటు ఈ పోస్టర్లో కొన్ని ఆసక్తిదాయకమైన ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: