తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రాని అద్భుతమైన కాంబినేషన్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత’చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన అందాల భామ పూజా హెగ్డె నటిస్తుంది.  రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారని టాక్. 

ఇక ఫస్ట్ పార్ట్ లో కంప్లీట్ గా రొమాంటిక్, ఎంట్రటైన్ మెంట్, కామెడీ జోనర్ తో సాగినపప్పటికీ..సెకండ్ ఆఫ్ మొత్తం ఫ్యాక్షన్ తరహాగా కొనసాగబోతున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ చేసిన అదిరిపోయే యాక్షన్ సీన్‌తో టీజర్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.  ఇక టీజర్ విషయానికి వస్తే..బ్యాక్ గ్రౌండ్‌లో జగపతి బాబు డైలాగ్స్ పవర్ ఫుల్ డైలాగ్స్ కొడుతున్నాడు.

‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటదో తెలుసా.. మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటదో తెలుసా..’ అంటూ జగపతి బాబు చెప్పే  డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ..‘కంటబడ్డావా.. కనికరిస్తానేమో.. ఎంటబడ్డనా నరికేస్తా..’అంటూ సిరియస్ గా వస్తున్న డైలాగ్స్ చూస్తుంటే ఈ చిత్రంలో ఏ రేంజ్ లో పవర్ ఫుల్  డైలాగ్స్ ఉంటాయో ఊహించుకోవొచ్చు.  అయితే ఈ టీజర్ బుధవారం ఉదయం 9గంటలకు రిలీజ్ అయింది. గంటలోనే 1.5 మిలియన్ డిజిటల్ వ్యూస్‌తో దూసుకుపోతూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: