మెగాస్టార్ 150వ మూవీ ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ హిట్ కొట్టాడు. ఇక అక్కడి నుంచి నెక్ట్స్ మూవీ కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. మెగాస్టార్ 151వ మూవీని కూడా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


సైరా నరసింహారెడ్డి మూవీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా వంటి బడా యాక్టర్లు కూడా కనిపించనున్నారు. మెగా ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాహుబలి తరహాలోనే ఈ మూవీ గురించి కేవలం మోషన్ పోస్టర్ తప్ప ఎలాంటి అప్ డేట్ లీక్ కాకుండా మూవీ యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోంది.


అయితే మెగా అభిమానుల కోసం త్వరలోనే సైరా టీజర్ రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ డిసైడ్ అయింది. చిరంజీవి బర్త్ డేకి ఓ రోజు ముందుగా టీజర్ రీలీజ్  చేసి గిఫ్ట్ ఇవ్వనున్నారు. దీనికోసం ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తెగ కసరత్తు చేస్తున్నాడు. అంతేకాదు.. ఈ న్యూస్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.


ఆగస్ట్ 21న ఉదయం 11.30 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నారు. దీంతో మెగా అభిమానులకు అటు చిరు బర్త్ డే తో పాటు టీజర్ రీలీజ్ కూడా రిలీజ్ చేసి బంపర్ బొనాంజా ఇవ్వనుంది సైరా మూవీ యూనిట్. ఈ మూవీ డైరక్టర్ చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలను బాగా తీశారని ఫిల్మ్ నగర్ టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: