నిన్నవిడుదలై సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ‘గీత గోవిందం’ ఒక విధంగా నెచురల్ స్టార్ నానీని అదేవిధంగా యంగ్ హీరోలు నాగచైతన్య శర్వానంద్ లను ఒక విధంగా మోసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎంత అనుభవం ఉన్న హీరోకు అయినా కథను వినగానే జడ్జ్ చేయడం అంత సులువుకాదు. అందువల్లనే అనేక మంది హీరోలు అనేక సూపర్ హిట్ సినిమా అవకాశాలను గతంలో పోగొట్టుక్కున్న సందర్భాలు ఉన్నాయి. 
సూపర్ పాజిటివ్ టాక్
 తెలుస్తున్న సమాచారం మేరకు ‘గీతగోవిందం’ సినిమా కథను చాలమంది హీరోలకు దర్శకుడు పరుశురామ్ చెప్పినా ఎవ్వరూ పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదు అని తెలుస్తోంది. దీనితో కష్టపడి  ఆఖరికి విజయ్ దేవరకొండను ఒప్పించిన విషయం చాలా  ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యవహారం అంతా  మూడేళ్ల కిందటి సంఘటన అంటున్నారు. 
విజయ్ వరుస సినిమాలు
‘గీత గోవిందం’ కథను డైరక్టర్ పరుశురామ్ నిర్మాత బన్నీ వాస్ కు చెబితే ఆకథ కోసం హీరోను వెతికే బాధ్యతను బన్నీ వాసు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈకదను నాని నాగాచైతన్యా శర్వానంద్ లకు చెప్పడం జరిగినా వారెవ్వరూ అప్పట్లో ఒప్పుకోకపోవడంతో అల్లు కాంపౌండ్ ఈకథను పక్కకు పెట్టి ‘శ్రీరస్తు శుభమస్తు’ తీసినట్లు టాక్. ఆతరువాత ఎదో విధంగా ఈకథకు విజయ్ దేవరకొండను ఒప్పించి అతడికి అనుకూలంగా మార్పులు చేర్పులు చేసారని తెలుస్తోంది.
‘అర్జున్ రెడ్డి' తర్వాత పెరిగిన క్రేజ్
అయితే ఆతరువాత ఈసినిమాకు హీరోయిన్ సమస్య ఏర్పడటంతో పాటు సినిమా రిలీజ్ కు ముందు పైరసీ సమస్యలతో సతమతమైన విషయం తెలిసిందే. ఈమధ్యలో ఈమూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈమూవీకన్నా తన ‘టాక్సీ వాలా’ అందరికీ నచ్చుతుందని విజయ్ దేవరకొండ అభిప్రాయ పడటంతో అతడిని ఒప్పించి ‘టాక్సీ వాల’ కన్నాముందుగా ‘గీత గోవిందం’  ను విడుదల చేయడానికి పెద్ద కసరత్తులే జరిగినట్లు సమాచారం. ఈమధ్యలో ఈకథను పరుశురామ్ కాపీ కొట్టేసాడని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు చేయడంతో మరో సమస్య కూడ ఎదురైంది. ఇలా ఎన్నో అనుకోని సమస్యలు ఈ సినిమాకు ఎదురైనా చివరికి ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ప్రస్తుతం ఈమూవీ యూనిట్ అంతా మంచి జోష్ లో ఉందని సమాచారం..   


మరింత సమాచారం తెలుసుకోండి: