మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తో తన 150 సినిమాలు పూర్తి చేశారు.  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమాకు చిరు తనయుడు రాంచరణ్ నిర్మాత.  స్వాతంత్ర సమరంలో బ్రిటీష్ వారినిక గజ గజలాడించిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.  ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  కాకపోతే ఆ మద్య కొన్ని అవాంతరాలు వచ్చినా ఇప్పుడు మాత్రం షూటింగ్ బిజీలో ఉన్నారు.  భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతోంది.
Image result for saira narasimha reddy
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేసే ఆలోచన ఉండటం వలన, ఆయా భాషలకి చెందిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు.  బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్, కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, శాండిల్ వుడ్ నుంచి కిచ్చ సుదీప్ లను తీసుకున్నారు.  తాజాగా ఒక ముఖ్యమైన పాత్ర కోసం పూనమ్ కౌర్ ను తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆడిషన్ కూడా పూర్తయిందని చెబుతున్నారు.
Image result for saira narasimha reddy
ఆ మద్య క్రిటిక్ కత్తి మహేష్, పవన్ కళ్యాన్ మద్య పెద్ద యుద్దం జరిగింది..ఆ సమయంలో పూనమ్ కౌర్ పేరు బయటకు వచ్చింది.  దాంతో ఈ అమ్మడుకి బాగా పబ్లిసిటి వచ్చింది.  ఈ మద్య శ్రీనవాస కళ్యాణం సినిమాలో కూడా నటించింది.  మళ్లీ ఇప్పుడు ఆమెకు అవకాశాలు దక్కుతున్నాయి. 'స్వర్ణ ఖడ్గం' ధారావాహికలో చేస్తోన్న ఆమె 'శ్రీనివాస కళ్యాణం'లోను కనిపించింది. 'సైరా'లోను ఆమె కనిపించనుండటం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: