‘గీత గోవిందం’ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి డైరక్టర్ పరుశురామ్ మీదకు మళ్లింది.  ప్రస్తుతం ఈడైరెక్టర్ తో సినిమాను తీయడానికి చాలామంది నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్తులలో ఈరేస్ లో తాను ముందు ఉన్నానని అంటూ పరుశురామ్ డైరక్టర్ గా మంచువిష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మాతగా త్వరలో సినిమా ప్రారంభించబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. దీనితో పరుశురామ్ తరువాత సినిమా మీద క్లారిటీ వచ్చేసినట్లే అని అనుకున్నారు అంతా.
 allu arjun with director parasuram
ఇప్పటికే విష్ణు కోసం ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ పరుశురామ్ రెడీ చేసినట్లుతెలుస్తోంది. అయితే ఈలీకులు వచ్చిన కొద్ది సేపటికే  గీత ఆర్ట్స్ సంస్థ రంగంలోకి దిగి పరుశురామ్ చేయబోయే తదుపరి సినిమా తమ బ్యానర్ లో ఉంటుందని లీకులు ఇవ్వడం ప్రారంభించింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి గల కారణం పరుశురామ్ వ్యవహార శైలి అని అంటున్నారు.
Mohan Babu Gayathri Movie Song make with 1400 artists
ఒక దర్శకుడుకి లేదా హీరోకి సినిమా రంగంలో అడ్వాన్స్ లు ఇవ్వడం అన్నది కామన్ అయినా చాలామంది దగ్గర అడ్వాన్స్ లు పుచ్చుకున్న దర్శకుడుకు కాని హీరోకి కానీ ఇలాంటి పరిస్థుతులు ఎదురౌతూ ఉంటాయి. ముఖ్యంగా ఒక దర్శకుడు తీసిన మూవీ సూపర్ హిట్ అయినప్పుడు అప్పటికే అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు ఆ దర్శకుడుతోనే సినిమాను తీయాలని పట్టుపడుతూ ఉంటారు.
Allu Aravind To Launch Fresh Talent
ఇప్పుడు ఇలాంటి పరిస్థితి పరుశురామ్ కు ఏర్పడింది అని అంటున్నారు.  తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పుడు పరుశురామ్ దగ్గర దాదాపు అరడజను అడ్వాన్స్ లు ఉన్నాయని వీటిలో గీతా, మంచు, భోగవిల్లి ప్రసాద్, మైత్రీమూవీస్ ఇలా అనేకమంది లైన్ లో ఉండటంతో ఇప్పుడు ‘గీత గోవిందం’ సక్సస్ మంచు అల్లు ఫ్యామిలీల వార్ గా మారింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో జోక్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: