బుల్లితెరపై తమదైన కామెడీ పండిస్తూ..యాంకరింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్న జోగి బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరు.  బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా ఈ జోడీ కడుపుబ్బా నవ్వించిన సందర్భాలు ఉన్నాయి.  తాజాగా యాంకర్, సినీ నటుడు జోగినాయుడు ద్వితీయ వివాహం చేసుకున్నారు.  అన్నవరంలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో, తన స్వగ్రామమైన విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన సౌజన్యను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు.
Jogi Naidu, Jhansi
జెమినీ టీవీలో ప్రోగ్రాం డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో జోగినాయుడు, యాంకర్ ఝాన్సీకి పరిచయం కావడం..ప్రేమగా మారి వీరిద్దరి పెళ్లి వరకూ దారి తీసింది. కొంత కాలం వీరి దాంపత్యం సాఫీగా సాగినా అనుకోని బేధాభిప్రాయాల వల్ల చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. దర్శకుడు అవ్వాలని వచ్చిన జోగినాయుడు పరిస్థితుల వల్ల నటుడిగా ముఖానికి రంగు పూసుకున్నారు. టీవీ ప్రోగ్రామ్‌లో 'ఏంటిరా అన్నియా' అంటూ తన వింత గళంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు.

స్వామిరారాలో మంచి పాత్ర వేశాడు.  జెమినీ టీవీలో జోగి బ్రదర్స్‌గా అన్నయ్య కృష్ణంరాజుతో కలిసి ప్రోగ్రామ్‌లు చేశారు. లుగు సినీ రంగంలో రాణిస్తున్న జోగినాయుడు, గతంలో ప్రముఖ యాంకర్ ఝాన్సీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై వారిద్దరి మధ్యా వచ్చిన మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. మరోసారి పెళ్లి పీటలు ఎక్కిన జోగినాయుడికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: