ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాష హీరోయిన్లు నటించిన చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయి.  మాలీవుడ్ నుంచి వచ్చిన కీర్తి సురేష్, సాయి పల్లవి జోరు కొనసాగుతున్న సమయంలనే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక మందన ఛలో, గీతాగోవిందం చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించింది.  కన్నడ ఇండస్ట్రీలో కిర్రాక్ పార్టీ  లో నటించిన రష్మిక తన సహనటుడు హీరో రక్షిత్ ని వివాహం చేసుకోబోతుందని..ఇప్పటికే వారి నిశ్చితార్థం కూడా అయ్యిందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

Related image
ఈ నేపథ్యంలో గీతాగోవిందం చిత్రంలో రష్మిక-విజయ్ దేవరకొండ ల మద్య కొన్ని రొమాన్స్, ఘాటైన లిప్ లాక్ సీన్లు ఉన్న విషయం తెలిసిందే.  దాంతో రక్షిత్ -రష్మిక ల మద్య తేడాలు వచ్చాయని..వారి ఇప్పుడు మాట్లాడుకోవడం లేదని రూమర్లు వచ్చాయి.  తాజాగా తనపై వస్తున్న వార్తపై రష్మిక మందన స్పందించారు. హా..హా..హా నా పెళ్లి ఆగిపోయిందట ఈ వార్తలు వింటుంటే..నాకు నవ్వు వస్తుందని..తన కొత్త చిత్రం ‘గీతాగోవిందం’సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని..తాను చాలా ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు. 
Image result for geetha govindam movie
తను, రక్షిత్, నిశ్చితార్థం నాడే, రెండున్నరేళ్ల తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, ఇప్పుడు నటనలో బిజీగా ఉండటంతో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్న తేదీలను నిర్ణయించుకోలేదని చెప్పింది.  ఇక ‘గీతాగోవిందం’చిత్రాన్ని పాతిక మంది హీరోయిన్లు రిజక్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి..ఎందుకు అలా చేశారో నాకు తెలియదని అన్నారు. కాగా, ప్రస్తుతం రష్మిక  తెలుగులో ‘డియర్‌ కామ్రేడ్, ‘దేవదాస్‌’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: