భారత మాజీ ప్రధాని వాజ్ పేయి మరణించినందుకు దేశం యావత్తు సంతాప దినాలు పాటిస్తూ ఉంటే ఆవిషయాలను పట్టించుకోకుండా చైతు అభిమానులు మారుతి పై చేసిన కామెంట్స్ ప్రస్తుత తరం ఆలోచనా ధోరణికి నిదర్శనం. ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకు సంబంధించి నిన్న సాయంత్రం ఆమూవీలోని రెండవ పాట విడుదల అవుతుందని చైతు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు. 
Sailaja Reddy Alludu
అయితే నిన్న సాయంత్రం ఈసినిమా యూనిట్ వర్గాలతో పాటు మారుతి ఈమూవీలోని రెండవ పాట విడుదల  చేయడం లేదని మాజీ ప్రధాని వాజ్ పేయి కన్నుమూత కారణంగా పాట విడుదలను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మారుతి ట్వీట్ చేశాడు. అయితే ఈకారణం నిజమే అని అనిపిస్తున్నా చైతన్య అభిమానులు మాత్రం మరో విధంగా అర్ధం చేసుకుని నాగచైతన్య కెరియర్ తో ఎందుకు ఆడుకుంటున్నావు అంటూ మారుతిని టార్గెట్ చేస్తూ చైతన్య అభిమానులు ట్విట్స్ పెడుతున్నారు. 
Naga Chaitanya's Sailaja Reddy Alludu gets a release date
దీనికితోడు ఈసినిమా ఆడియో ఫంక్షన్ మరొకసారి వాయిదా పడటం కూడ చైతన్య అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఈమూవీ విడుదలకు పట్టుమని 2 వారాలు కూడా టైమ్ లేని ఈ పరిస్థితుల్లో ఇలా ఈవెంట్స్ అన్నింటినీ వాయిదా వేసుకుంటూ పోతే సినిమాకు క్రేజ్ ఎలా వస్తుంది అంటూ చైతూ అభిమానులు మారుతిని టార్గెట్ చేస్తూ ఘాటైన కామెంట్స్ పెట్టడంతో తట్టుకోలేక మారుతి ఈకామెంట్స్ పై రియాక్ట్ అయ్యాడు. 

ప్రస్థుతం తాను కేరళాలో ఈసినిమాకు సంబంధించి రీ రికార్డింగ్ పనులు చేయిస్తూ కేరళలో ప్రస్తుతం వరదల మధ్య చిక్కుకున్నానని ఈ విషయాలు తెలియక తనను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు అంటూ చైతన్య అభిమానుల పై అసహనాన్ని వ్యక్త పరిచాడు మారుతి. అంతేకాదు ఈమూవీ ప్రచారానికి సంబంధించిన నిర్ణయాలు తనవి కావనీ అది అంతా నిర్మాతలు చూసుకుంటారు అని మారుతి ట్విట్ చేయడంతో చైతన్య అభిమానులు ఇప్పుడు తమ కోపాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మాతల పై చూపెడుతున్నారు. భారత దేశానికి సంబంధించి భారత రత్న వాజ్ పేయి చనిపోయినా ఆ విషయాలకన్నా తమకు ‘శైలజా రెడ్డి’ సినిమాలోని పాట మాత్రమే ముఖ్యం అంటూ హడావిడి చేసిన చైతూ అభిమానుల తీరు నాగచైతన్యకు అయినా అర్ధం అవుతందా అన్నదే సందేహం..  


మరింత సమాచారం తెలుసుకోండి: