భారతీయ సినీ రంగంలో తన స్టైల్ తో కోట్ల మంది అభిమానులను సంపాదించిన హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఒకప్పుడు తెరపై రజినీకాంత్ సిగరెట్ తో స్టైలిష్ గా చేసే విన్యాసాలు ఎంతో మంది యువత ఫిదా అయ్యేవారు. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. అయితే రజినీ సరసన ఛాన్స్ రావడం అనేది అంత సులభమైన విషయం కాదు..ఒకవేళ అలా వస్తే ఆ హీరోయిన్ అదృష్టవంతులే అనొచ్చు. ఇండస్ట్రీలో 40 ఏళ్ల ప్రస్థానం ఆయనది. 150కి పైగా సినిమాల్లో నటించారు. 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో 2003 ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష.
ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించి నెంబర్ వన్ పొజీషన్లోకి వెళ్లింది. తెలుగు,తమిళ, మళియాళ ఇండస్ట్రీలో త్రిష ఇప్పటికే బిజీ హీరోయిన్ గానే కొనసాగుతున్నారు. గత కొంత కాలంగా ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది. ఇప్పటికీ సీనీ ఫీల్డ్లో పదిహేను సంవత్సరాలు పూర్తి చేసింది త్రిష. ఇప్పటి వరకు రజనీకాంత్కు జోడీగా త్రిష నటించలేదు. ఇప్పుడు కోలీవుడ్వాసులు ఆ సమయం వచ్చిందంటున్నారు.
రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఇందులో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తున్నారు. 1999లో తమిళంలో వచ్చిన ‘జోడి’ సినిమాలో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తే, అందులో త్రిష ఓ చిన్న పాత్ర చేశారు. రీసెంట్గా డెహ్రాడూన్లో ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. తర్వాతి షెడ్యూల్ చెన్నై, మధురైలో ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రంలో జయ్ సేతు పతి, బాబీ సింహా, సనత్ రెడ్డి, మేఘా ఆకాశ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.