సమంత ప్రధాన పాత్రగా .. థ్రిల్లర్ నేపథ్యంలో 'యూటర్న్' సినిమా నిర్మితమైంది. ఆది పినిశెట్టి .. రాహుల్ రవీంద్రన్ .. భూమిక ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి పవన్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించాడు.   మిస్టరీ థ్రిల్లర్‌ మూవీలో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపించబోతోంది.  యూటర్న్ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయింది. పాటల చిత్రీకరణతో మొత్తం పూర్తవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కన్నడలో ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఈయనే. అక్కడ హిట్ కావడం వలన రీమేక్ గా ఈ సినిమా రూపొందింది.

సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘నేను ఈరకంగా బార్ కౌంటర్ లో ఇన్ని శబ్దాల మద్య ఇలా కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు..ఈ ఐదు రోజులు నా లైఫ్ లో జరిగిందంతా...నిజమా అబద్దమా అంటూ సమంత డైలాత్స్ తో ట్రైలర్ మొదలైంది.  ఈ సినిమా మొత్తం మర్డర్ మిస్టరీ ఉత్కంఠంగా సాగింది.

కథ అంతా కూడా 'ఆర్కే పురం' ఫ్లై ఓవర్ పై జరిగిన యాక్సిడెంట్ చుట్టూ తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.  సమంత పదే పదే ఈ నేరం నేను చేయలేదు అంటూనే..ఆ మర్డర్ పై పలువురిని ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది.  ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలతో ఈ సినిమా కొనసాగుతుందనే విషయం స్పష్టమవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: