ఈ మద్య సినిమాలు సక్సెస్ టాక్ వస్తే చాలు..విజయోత్సవ సభలు అంటూ ఊరూరా తిరుగుతున్నారు చిత్ర యూనిట్.  దాంతో సినిమాపై మరింత ఫోకస్ పడుతున్న విషయం తెలిసిందే.  అయితే  సినిమా అయినా..పెద్ద సినిమా అయిన  కంటెంట్ బాగుంటే మంచి విజయాన్ని కట్టబెడుతున్నారు తెలుగు ప్రేక్షకులు.  తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ‘గీతా గోవిందం’హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్లు వర్షం కురిపిస్తుంది.  గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై .. బన్నీవాసు నిర్మాతగా 'గీత గోవిందం' చిత్రం తెరకెక్కింది.
Image result for geetha govindam
పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయింది.   భారీ వసూళ్లను సాధిస్తూ విజయ విహారం చేస్తోంది. దాంతో ఈ సినిమా టీమ్ విజయోత్సవ వేడుక నిర్వహించాలని నిర్ణయించుకుంది. (ఆదివారం) హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో విజయోత్సవ వేడుకను జరపనున్నారు. 
Image result for geetha govindam
సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరుకానున్నారు. అంతే కాదు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన 'బిగ్ బాస్ 2' హౌస్ కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరో 10 రోజుల వరకూ 'గీత గోవిందం' వసూళ్ల జోరు కొనసాగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.   


మరింత సమాచారం తెలుసుకోండి: