టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమల్లో ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగాను, అంతర్జాతీయ స్దాయిలోను పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవితాలను వెండితెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ నటినటుల జీవిత చరిత్రలు ఉన్నాయి. తెలుగు లో రిలీజ్ అయిన మహానటి, బాలీవుడ్ లో ‘సంజు’చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎన్.టి.రామరావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బింధువు అయిన జయలలిత బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నారట. జయలలిత బయోపిక్ సినిమాను విబ్రి మీడియా పతాకంపై విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. ఎన్టీఆర్ బయోపిక్, కపిల్దేవ్ బయోపిక్ '83' తెరకెక్కిస్తున్నది కూడా విబ్రి మీడియానే కావడం విశేషం.
డైరెక్టర్ బృంద ప్రసాద్ అడుసుమిల్లి మాట్లాడుతూ...‘దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన వాళ్లలో ఒకరైన జయలలిత జీవితం స్ఫూర్తిదాయకం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఆమె ఆదర్శనీయం. అలాంటి వ్యక్తి ఈ చిత్రం ద్వారా ఘన నివాళి అర్పించాలనుకుంటున్నాం. ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నాఅన్నారు.
ఈ పాత్రను తాము చేయడానికి సిద్దంగా ఉన్నట్టు పలువురు హీరోయిన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా మదరాస పట్టణం’ ఫేమ్ విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు. రాజకీయాల్లోకి రాకముందు జయలలిత 140కిపైగా చిత్రాల్లో నటించారు. అయితే.. జయలలిత జీవితంలో వివాదాస్పద అంశంగా మిగిలిపోయిన శోభన్బాబు ఎపిసోడ్కు సంబంధించి ఈ సినిమాలో ప్రస్తావన ఉంటుందో లేదో చూడాలి