కేరళలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడ ప్రజలు నానా ఇబ్బదులు పడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రై ఒక్కరు సహాయంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా సిని సెలబ్రిటీస్ కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు.


తెలుగు స్టార్స్ ఇప్పటికే ఒక్కొక్కరుగా తమ వంతు సహాయం అందిస్తున్నారు. చిరు ఫ్యామిలీ నుండి చిరంజీవి, రాం చరణ్ కలిసి 50 లక్షలు విరాళం ప్రకటించగా ఉపాసన 1.4 కోట్లు ఎనౌన్స్ చేశారు. ఇక మరో పక్క విజయ్ దేవరకొండ 5 లక్షలు. అల్లు అర్జున్ పాతిక లక్షలు డొనేట్ చేశారు.


ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఏకంగా 14 కోట్లు విరాళం ప్రకటించాడని తెలుస్తుంది. ఇంత పెద్ద మొత్తం ఇచ్చిన తొలి హీరో విజయ్ అని తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కోలీవుడ్ స్టార్ హీరోగా విజయ్ ఇలాంటి సందర్భాల్లో తన గొప్ప మనసు చాటుకున్నాడు.


అంతకుముందే కమల్ హాసన్ 25 లక్షలు, సూర్య కార్తి కలిసి మరో పాతిక లక్షలు డొనేట్ చేశారు. ధనుష్ 15 లక్షల సాయం అందించగా తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ తరపున 2 కోట్ల రూపాయలు సిఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించారు. కొద్ది నిమిషాల క్రితం మహేశ్ కూడా పాతిక లక్షల రూపాయలను కేరళ వరద బాధితుల సహాయార్ధం విరాళం ప్రకటించారు. ప్రభాస్ కోటి దాకా విరాళం ప్రకటించాడని తెలుస్తుంది. అయితే విజయ్, ప్రభాస్ ల విరాళాలు అఫిషియల్ గా తెలియాల్సి ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: