ఈవారం 22వ తారీఖున రాబోతున్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒకప్రముఖ దిన పత్రికకు చిరంజీవి తనతల్లి అంజనాదేవి కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వివరించడంతో పాటు తన తల్లితో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి చాలామందికి తెలియని విషయాలను వివరించాడు. కొంతకాలం క్రితం తనతల్లి ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆమె శారీరకంగా మానసికంగా డౌన్ అయిన సందర్భాన్ని వివరిస్తూ తాను ఆమెకు చేసిన చికిత్సకు సంబంధించి ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు. 

తాను ‘ఖైదీ నెంబరు 150’ షూటింగ్ తో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో నాగబాబు టివి షోలతో బాగా బిజీ అయిపోయి అప్పట్లో తాము తరుచూ తమతల్లిని పలకరించడం బాగా తగ్గిపోయిన విషయాన్ని చిరంజీవి బయటపెట్టాడు. దానితో ఆమె ఒంటరి తనం ఫీల్ అయి డిప్రెషన్ కు గురి కావడమే కాకుండా తనతల్లితో కలిసి ఉండే తన అమ్ముమ్మ కూడ చనిపోయిన తరువాత తనతల్లి మరింత దిగాలు పడిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 
Megastar Chiranjeevi fires on this Mega Hero?
ఆసందర్భంలో తానే ఒక మానసిక వైద్యుడుగా మారి తనతల్లి వద్దకు వెళ్లి ‘నీ ముగ్గురు బిడ్డలు సూపర్ స్టేటస్’ లో ఉన్నారు ఈఅదృష్టం ఎవరికీ లేదు. సురేఖకు కూడ లేదు సురేఖకు భర్త ఒక స్టార్ కొడుకు ఒక స్టార్ మాత్రమే కానీ నీ మనవళ్ళు మనవరాళ్ళు కూడ స్టార్స్’ అంటూ తాను అనగానే తన తల్లి ముఖంలో చాల కాలం తరువాత నవ్వు చూసిన విషయాన్ని చూసి ధైర్యం తెచ్చుకున్నాను అంటూ తన తల్లి పై తనకున్న ప్రేమను వ్యక్త పరిచాడు చిరంజీవి. ఆతరువాత తాను ఇంకా చాల మంచి మాటలు చెప్పడంతో తనతల్లి తనంతట తానుగా తనఇంట్లో ఉంటాను అని అనేడట్లుగా చేయగలిగాను అంటూ చిరంజీవి తనలోని మెగా మానసిక వైద్యుడుని కూడా బయటపెట్టాడు. 
gallery
ఆతరువాత తనతల్లి తనఇంటికి వచ్చాక తాను తనతమ్ముళ్ళు నాగబాబు పవన్ లకు ఫోన్ చేసి మీకు ఎన్నోఉన్నా మీకన్నా నాకు మరొకటి ఎక్కువగా ఉంది అంటూ ‘మేరా పాస్ మేరా మా హై’ అంటూ అనగానే నాగబాబు పవన్ లు తనను అభినందించిన విషయాన్ని బయటపెట్టాడు. ఇదేసందర్భంలో చిరంజీవి తనతల్లి గురించి మాట్లాడుతూ తనఅమ్మకు ఉన్న సినిమా పిచ్చి తన తండ్రికి నటన పై ఉన్న ఆసక్తి వల్లనే తాను మెగా స్టార్ అయ్యానని లేకుంటే తాను కూడ చాలామందిలా ఎక్కడో ఉద్యోగం చేసుకుని ఈపాటికి తాను రిటైర్ అయిపోయి తాను ఉండవలసిన వాడిని అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు మెగా స్టార్..    



మరింత సమాచారం తెలుసుకోండి: