మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇన్నాళ్లు చిరు తనయుడిగా స్టార్ ఇమేజ్ తో సినిమాలు చేస్తున్నా తన మార్క్ చూపించే సినిమా పడలేదని అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉంది. ఆ నిరాశని తొలగిస్తూ రంగస్థలం సినిమా తనలోని నటుడిని పరిచయం చేశాడు రాం చరణ్. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నిటిని క్రాస్ చేసి దమ్ము చూపించింది.


రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు రాం చరణ్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడట. పవర్ ఫుల్ పోలీస్ గా చరణ్ తన సత్తా చాటుతాడని అంటున్నారు. చరణ్ పాత్రలో చాలా ట్విస్టులు ఉంటాయట.


వివేక్ ఓబేరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ సోదరులుగా కోలీవుడ్ హీరో ప్రశాంత్, ఈవివి తనయుడు ఆర్యన్ రాజేష్ లు నటిస్తున్నారట. భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కియరా అద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్నారు. 


జయ జానకి నాయకా సినిమాతో కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపించిన బోయపాటి శ్రీను రాం చరణ్ తో చేస్తున్న సినిమాతో మరోసారి తన డైరక్షన్ టాలెంట్ చూపించబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మెగా అభిమానులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: