బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రౌనత్ పై పోలీసు కేసు నమోదైంది.  ఇప్పటి వరకు ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా రౌనత్ సెక్స్ విషయంలో ఓపెన్ గా మాట్లాడటం..డేటింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం..ఇండస్ట్రీలో తనను చాలా మంది వాడుకోవడానికి ప్రయత్నించారని..కాస్టింగ్ కౌచ్ ఇక్కడ దారుణంగా ఉందని రక రకాల కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచారు. 
Related image
ఏది ఏమైనా ఇవన్నీ ఒక ఎత్తు అయితే..తనకు మాత్రం వరుసగా సినిమా ఛాన్సులు రావడం అవికాస్త మంచి హిట్ కావడంతో కంగనా కి బాగా డిమాండ్ పెరిగింది.  గతంలో హృతిక్ రోషన్ వివాదం ఆమెను ఇండస్ట్రీలో హైలెట్ చేసింది.  అయితే కంగనాపై పోలీసు కేసు నమోదు అయ్యింది..వివరాల్లోకి వెళితే..ముంబైలోని పాలీహిల్ లో గత ఏడాది ఆమె రూ. 20.07 కోట్లు పెట్టి ఓ ఇల్లు  కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  ఒప్పందం ప్రకారం తనకు చెల్లించాల్సిన బ్రోకరేజ్ ను చెల్లించలేదంటూ ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్ లో కంగన, ఆమె సోదరి రంగోలిలపై ప్రకాశ్ జీ రోహిర అనే బ్రోకర్ ఫిర్యాదు చేశాడు. 
Image result for kangana ranaut house mumbai police case house
ఆ ఇల్లు కొనగోలు చేయడానికి పూర్తిగా తానే బాధ్యతలు వహించానని అందుకు తనకు ఇవ్వాల్సిన పూర్తి డబ్బులు చేల్లించడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, దీనిపై కంగన ప్రతినిధులు స్పందిస్తూ... ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన 1 శాతం (రూ. 20 లక్షలు) చెల్లించామని... కానీ ఇప్పుడు ఆయన 2  శాతాన్ని డిమాండ్ చేస్తున్నాడని చెప్పారు. నగదు చెల్లించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కంగనా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'మణికర్ణిక' చిత్రంలో ప్రస్తుతం కంగన నటిస్తోంది.  విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: