బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, అమెరికా సింగర్ నిక్ జోనాస్ల ఎంగేజ్మెంట్ శనివారం ముంబైలో రోకా ఫంక్షన్ పేరుతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఈషా అంబానీ, సంజయ్ లీలా భన్సాలీ, విశాల్ భరద్వాజ్, ఆయుష్ శర్మ, అలియా భట్, అర్పితా ఖాన్, పరిణీతి చోప్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మద్య సినీ సెలబ్రెటీలు అనాథ ఆశ్రమాలు, వృద్దాశ్రమాలు సందర్శిస్తూ..వారికి తగిన సహాయం అందించడమే కాదు..వారితో కలిసి సెలబ్రేట్ చేస్తూ..సంతోషాన్ని పంచుతున్నారు.
తాజాగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ అతని కుటుంబ సభ్యులతో పాటు ముంబైలోని కేథరీన్ అనాథాశ్రమాన్ని సందర్శించారు. ఇక ప్రియాంక చోప్రా అక్కడున్న పిల్లల ముందు డ్యాన్స్ వేస్తూ..అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ పాపతో డ్యాన్స్ చేస్తూ..అక్కడ ఉన్నవారిని ఎంట్రటైన్ చేసింది. ప్రియాంక, నిక్లు అనాథ చిన్నారులను కలుసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ సందర్భంగా నిక్ తన ఇన్స్టా స్టోరీలో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రియాక చిన్నారులతో కలిసి నృత్యం చేస్తూ కనిపిస్తోంది. దీనిని షేర్ చేసిన నిక్ ‘ఈ రోజు సెయింట్ కేథరిన్ అనాథాశ్రమంలో నా హృదయం ఉప్పొంగిపోయింది’ అంటూ ఒక కామెంట్ కూడా రాశారు. త్వరలోనే నిక్-ప్రియాంకల వివాహం అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో జరగనున్నట్లు తెలుస్తోంది.