తెలుగు ఇండస్ట్రీలో దాదాపు పది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి చిరు తనయుడు రాంచరణ్ నిర్మాణ సారధ్యం వహించారు. తమిళంలో ఇళయదళపతి విజయ్ నటించిన ‘కత్తి’చిత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ‘ఖైదీ నెంబర్ 150’ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రైతులకు సంబంధించిన మెసేజ్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. అంతే కాదు ఈ చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో రుజువు చేశారు.
ఖైదీ నెంబర్ 150 సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టి, చిరంజీవి కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలి హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు.
కాకపోతే ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించకపోవొచ్చని అంటున్నారు..కేవలం నిర్మాణ బాధ్యతలు తీసుకొని వేరు దర్శకుడికి బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.