విజయ్ దేవరకొండ మ్యానియా పెరిగిపోవడంతో అతడి పై వస్తున్న వార్తలు కూడ రోజురోజుకు పెరిగి పోతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈక్రేజీ యంగ్ హీరో పై మరొక ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. మొన్న ఆదివారం రాత్రి స్టార్ మాటివి ప్రసారం చేసిన ‘బిగ్ బాస్ 2’ కార్యక్రమాలలో విజయ్ దేవరకొండ అతిధిగా కొంతసేపు మెరిసాడు.
అయితే ఆరోజు కార్యక్రమంలో ఉన్నది కొద్ది సేపు మాత్రమే అయినా అతడి మ్యానియా ‘బిగ్ బాస్ 2’ ని వీక్షించిన బుల్లితెర ప్రేక్షకులకు కూడ సోకింది. ఆరోజు కార్యక్రమంలో విజయ్ ‘బిగ్ బాస్’ హౌస్ మేట్స్ తో సరదా సరదాగా మాట్లాడుతూ ముఖ్యంగా దీప్తి సునైనాకు టాస్క్ లు ఇచ్చి సందడి చేసిన విధానం బుల్లితెర ప్రేక్షకులకు విపరీతంగా నచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ కార్యక్రమం ప్రసారం అయి ఒకరోజు పూర్తి కాకుండానే స్టార్ మా యాజమాన్యాన్ని ఉద్దేశిస్తూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ మాటివి యాజమాన్యాన్ని ఆశ్చర్య పరుస్తున్నట్లు సమాచారం. మరి కొన్ని రోజులలో ‘బిగ్ బాస్ 2’ సీజన్ ముగిసి పోతుంది కాబట్టి ఆకార్యక్రమం ముగిసిన తరువాత ఎక్కువ సమయం గ్యాప్ తీసుకోకుండా ‘బిగ్ బాస్ 3’ సీజన్ షోను విజయ్ దేవరకొండ హోస్ట్ గా స్టార్ మా యాజమాన్యం ఎనౌన్స్ చేయగలిగితే బుల్లితెరకు ఇప్పటి వరకు ఎవరు చూడని రేటింగ్స్ రావడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈకామెంట్స్ స్టార్ మా దృష్టికి కూడ వెళ్ళాయి అని తెలుస్తోంది. ఈపరిస్తుతులు చాలవు అన్నట్లుగా ‘గీత గోవిందం’ షాక్ బాలీవుడ్ కు కూడ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. గతవారం విడుదలైన బాలీవుడ్ భారీ సినిమాలు ‘గోల్డ్’ ‘సత్యమేవ జయతే’ సినిమాల కంటే ఓవర్సీస్ లో ‘గీత గోవిందం’ సినిమాకు డాలర్ల వర్షం ఎక్కువగా కురుస్తోంది అంటూ బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చేసిన ట్విట్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. దీనితో విజయ్ మ్యానియా ఏస్థాయికి చేరుకుంటుందో ఎవరికీ అర్ధం కాని విషయంగా మారింది..