నాగాచైతన్యను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సమంత ఇప్పుడు ఏకంగా చైతూ సినిమాకు సమస్యలు సృష్టించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ నెలాఖరున విడుదల కావలసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ విడుదల వాయిదాకు అసలు సమస్య కేరళ వరదలు కాదని సమంత అనీ ఇండస్ట్రీలో గాసిప్పుల హడావిడి జరుగుతోంది.
ఇప్పటికే సమంత ‘శైలజా రెడ్డి’ సినిమాలోని చాల సీన్స్ ను చూసిన సమంత ఆమూవీలోని కొన్ని సీన్స్ విషయాలో ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ విషయంలో సమంత అబ్యంతరాలు వ్యక్తం చేసినట్లు టాక్. వాస్తవానికి వెన్నెల కిషోర్ కామెడీ ఏవిధంగాను ‘శైలజా రెడ్డి’ సక్సస్ కు సహకరించదని సమంత అభిప్రాయ పడుతున్న నేపధ్యంలో ఈమూవీలోని కామెడీ సీన్స్ ను తిరిగి రీ షూట్ చేయడానికే ‘శైలజా రెడ్డి’ ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ సెప్టెంబర్ 13న మాత్రమే విడుదల అవుతుందని అంటున్నారు. దీనితో ఇండస్ట్రీ ఫైట్ డేట్ గా మారుతుంది అనుకున్న ఆగష్టు 31 ఇప్పుడు హడావిడి లేని అనాధగా మారిపోయింది. వాస్తవానికి ఆగష్టు 31న నాగచైతన్య ‘సవ్యసాచి’ విడుదల కావాలి.
అయితే చైతూకు ‘శైలజా రెడ్డి’ పై ఉన్న విపరీతమైన మోజుతో ‘సవ్యసాచి’ ని వెనుకకు పెట్టి ‘శైలజా రెడ్డ్ అల్లుడు’ పై నమ్మకం పెట్టుకుని పూర్తి చేసాడు. కానీ చైతన్య ప్లాన్స్ అన్నీ తిరిగబడటంతో అటు ‘సవ్యసాచి’ ఇటు ‘శైలజా రెడ్డి’ ల సినిమాలకు పనికిరాని డేట్ గా ఆగష్టు 31గా మారిపోయింది. దీనితో అనుకోకుండా సమంత చేసిన అన్వేషణ నాగచైతన్యకు సమస్యగా మారిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..