మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా మూవీ సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా ఖైదీ నెంబర్ 150 పదేళ్ల తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి స్టామినా ప్రూవ్ చేసింది. 


ఈరోజు సైరా నరసింహా రెడ్డి టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లో అత్యంత వైభవంగా జరిగింది. చిరంజీవి తల్లి అంజనా దేవి చేతుల మీదగా ఈ సైరా టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. చిరు ఏరికోరి చేస్తున్న మూవీ కాబట్టి హైబడ్జెట్ తో తీస్తున్నామని అన్నారు నిర్మాత రాం చరణ్.   


అయితే ఎంత బడ్జెట్ అన్నది మాత్రం రివీల్ చేయలేమని అన్నారు. నెంబర్స్ రివీల్ చేయదల్చుకోలేదని తేల్చేశారు చరణ్. నాన్నగారి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నామని.. తాను గతంలో చెప్పినట్లుగా ప్రాఫిట్ వస్తే తమకు బోనస్ అన్నారు. అలా రాకపోయినా కూడా తమకు హ్యాపీయే అని అన్నారు చరణ్.     


మగధీర టైంలో సెకండ్ మూవీనే సోషియో ఫాంటసీ చేస్తున్నావని.. 40 ఏళ్ళుగా సినిమాలు చేసినా ఆయనకు అలాంటి సినిమా రాలేదని చరణ్ తో చిరు అన్నారట. అందుకే సైరా నరసింహా రెడ్డి మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నామని.. తండ్రి కోరిక ఈ సినిమాతో తీరుతుందని అన్నారు చరణ్.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: