‘నాపేరు సూర్య’ సూపర్ ఫ్లాప్ తరువాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను ఫైనల్ చేయడానికి భారీ కసరత్ చేసాడు. ఎందరో దర్శకులు చెప్పిన ఎన్నో కధలు విన్న బన్ని చిట్టచివరకు దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథకు ఫైనల్ గా వోట్ వేసాడు అని వార్తలు వస్తున్నాయి.
రూ. 100 కోట్ల బడ్జెట్ అవసరం
తెలుస్తున్న సమాచారం మేరకు ఈకథ పునర్జన్మల నేపధ్యంలో ఉంటుందని ముఖ్యంగా ‘మనం’ సినిమాలో విక్రమ్ కుమార్ అనుసరించిన రివర్స్ స్క్రీన్ ప్లే టెక్నిక్ లో ఈమూవీ కూడ ఉండబోతుందని సమాచారం. ‘మూగమనసులు’ సినిమా నుండి మొన్నటి ‘మనం’ వరకు పునర్జన్మల కథలతో తీసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయిన నేపధ్యంలో ఆ సెంటిమెంట్ ను నమ్ముకుని బన్నీ విక్రమ్ కుమార్ ల మూవీ త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. 
పారిస్ వెకేషన్లో ఉన్న అల్లు అర్జున్
ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈమూవీలో నటిస్తున్న అల్లు అర్జున్ కు కానీ దర్శకత్వం వహిస్తున్న విక్రమ్ కుమార్ కు కానీ పారితోషికాలు ఏమి ఇవ్వకుండా కేవలం ఈసినిమా ప్రాజెక్ట్ బడ్జెట్ నిమిత్తం 45 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు సమాచారం. సినిమా నిర్మాణం పూర్తి అయిన తరువాత ఈమూవీకి జరిగిన బిజినెస్ లో బన్నీకి విక్రమ్ కుమార్ కు వాటాలు ఇచ్చే పద్ధతిలో ఈసినిమా నిర్మాణం జరుగుతుంది అని అంటున్నారు. 
బ్లాక్ బస్టర్ కొట్టాలని కసిగా ఉన్న బన్నీ
భారీ సాంకేతిక నిపుణులను ఎంచుకుని నిర్మాణ విలువలలో ఎక్కడా రాజీ పడకుండా ఈసినిమాను చేయాలని విక్రమ్ ఆలోచన అని అంటున్నారు. ముఖ్యంగా ఈమూవీలోని బన్నీ లుక్ డిఫరెంట్ గా చూపెట్టడానికి ఇప్పటికే కొందరు ప్రముఖ స్టైలిస్ట్ లతో చర్చలు జరుగుతున్నట్లు టాక్. ప్రస్తుతం పరాజయాల బాటలో కొనసాగుతున్న విక్రమ్ బన్నీలకు ఈమూవీ సక్సస్ చాల కీలకం కావడంతో ఎటువంటి హడావిడి లేకుండా ఈమూవీని నెమ్మదిగా తీస్తానని ఇప్పటికే విక్రమ్ బన్నీకి చెప్పినట్లు టాక్..   
.


మరింత సమాచారం తెలుసుకోండి: