తెలుగు, తమిళంలో హీరోగా నటించిన ఆది పినిశెట్టి ‘సరైనోడు’ సినిమాతో విలన్ గా నటించాడు. సరైనోడు, నిన్ను కోరి, అజ్ఞాతవాసి, రంగస్థలం లాంటి చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఇక రంగస్థలం సినిమాలో రాంచరణ్ అన్నగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. సస్పెన్ష్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుక వస్తోంది.
అయితే ఈ సినిమాలో కేవలం సస్పన్ష్, థ్రిల్లర్తో కామెడీకి కొదవలేదని తెలియజేస్తూ తాజాగా నవ్వుల ట్రైలర్ను తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ హీరో రాంచరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్ కార్పోరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించారు. హరినాథ్ దర్శకత్వం వహించారు.
కోన వెంకట్ స్క్రీన్ప్లే, డైలాగులు అందించారు. ఇందులో ఆది పినిశెట్టి అంధుడిగా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసిన రాంచరణ్కు ఆది ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘నా సోదరుడు రాంచరణ్కు హృదయపూర్వక ధన్యవాదాలు. నవ్వులతో నిండిన నీవెవరో రెండో ట్రైలర్ను నా చిట్టిబాబు విడుదల చేశాడు. రెండు రోజుల్లో వస్తున్నాం’ అని ఆది ట్వీట్ చేశారు.