టాలీవుడ్ లో ఈ మద్య వరుసగా ఒకేరోజు నాలుగు,ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కథా కథనం బాగుంటే మంచి విజయం సాధించి పెట్టిన పెట్టుబడులు రాబడుతున్నాయి. మరికొన్ని సినిమాలైతే ఘరంగా ఫ్లాప్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో రంగస్థలం, భరత్ అనే నేను, నాపేరు సూర్య,మహానటి తర్వాత ఆ తరహా పెద్ద సినిమాలు రాలేదు..భారీ కలెక్షన్లు కూడా రాబట్టలేదు.
ఇప్పటి వరకు అన్ని చిన్న సినిమాలే వస్తున్నాయి..కాకపోతే ఈ మద్య ఆర్ ఎక్స్ 100, సమ్మోహనం, గూఢచారి లాంటి సినిమాల మంచి సక్సెస్ అందుకొని మంచి కలెక్షన్లు రాబట్టాయి. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ‘గీతా గోవిందం’సూపర్ డూపర్ హిట్ అయి..50 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్దంగా ఉంది. రేపు శుక్రవారం మరోసారి నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
నీవెవరో, ఆటగాళ్లు, అంతకుమించి, లక్ష్మీ సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. వీటిలో ఇప్పటి వరకు మంచి ప్రమోషన్ వర్క్ చేస్తూ..హైప్ పెంచిన సినిమాలు ‘ఆటగాళ్లు’. ఈ సినిమాలో నారా రోహిత్, జగపతిబాబులు ప్రధాన పాత్రలను పోషించారు. 'నీవెవరో' సినిమాలో ఆది పినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ లు జంటగా నటిస్తున్నారు. 'నీవెవరో' ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ రిలీజ్ చేశారు.
ఆటగాళ్లు, నీవెవరో సినిమాల పై భారీ అంచనాలు ఉండగా... ప్రభుదేవా నటించిన 'లక్ష్మీ' చిత్రంపై కూడా ఆసక్తి నెలకొంది. 'అంతకుమించి' చిత్రంలో రష్మి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.