టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సైరా’ టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు. రాజకీయాల్లో పది సంవత్సరాల పాటు తన సత్తా చాటిన మెగాస్టార్ చిరంజీవి తిరిగి ‘ఖైదీ నెంబర్ 150’తో రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో చిరంజీవి గ్రేస్ తగ్గిపోయిందని..ఆయన స్టామినా కోల్పోయాడని తెగ రూమర్లు వచ్చాయి. కానీ వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’సినిమా చూసిన తర్వాత అందరి ఫూజులు ఎగిరిపోయాయి..పది సంవత్సరాల క్రితం శంకర్ దాదా జిందాబాద్ లో ఎలా ఉన్నారో ఇప్పుడూ అదే స్టైల్..అదే ఎనర్జీ..అదే గ్రేస్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ సంబరపడిపోయారు మెగా అభిమానులు.
ప్రస్తుతం చిరంజీవి 151వ సినిమా తొలి తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీలో సెలబ్రెటీలు అందరూ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి క్యూకట్టారు.
ఇదిలా ఉంటే.. వంశీ పైడిపల్లి తన బర్త్డే సందర్బంగా ఇండస్ట్రీకి చెందిన టాప్ డైరెక్టర్స్ అందరిని ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విందులో పాల్గొన్న దర్శకులు వంశీతో కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఒకే ఫ్రేమ్లో టాప్ దర్శకులు అందరు కనిపించేసరికి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇదిలా ఉంటే నిన్న అల్లు అరవింద్ మెగాస్టార్ కోసం ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన ఓ ప్రత్యేక కేక్ కూడా తెప్పించారు. ఆ పార్టీలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకలు పాల్గొన్నారు.
వంశీ పైడిపల్లి, సుకుమార్, కొరటాల శివ, వక్కంతం వంశీ, పరశురాం, బి. గోపాల్,బోయపాటి శీను, మెహర్ రమేష్ తదితరులు చిరు బర్త్ డే సందర్భంగా ఆయన ఇంటికి వెళ్ళి ఈ ఫోటో దిగారు. మెగాస్టార్తో దర్శకుల సెల్ఫీ అదిరిందని అభిమానుల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో మరో ఆంతర్యం కూడా ఉందని అంటున్నారు..చిరంజీవి తన 152,153,154,155 సినిమాలు ఈ దర్శకులతో ప్లాన్ చేసుకుంటాడేమో అని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు.