బాహుబలి మూవీతో ప్రభాస్ అంటే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ మూవీతో కోట్లాది మంది భారతీయులకు ఆరాధ్యదైవంగా మారిపోయాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ కాస్తా నేషనల్ స్టార్ లా మారిపోయాడు. అంతేకాదు నేషనల్ రేంజ్ లోనే ఆయనతో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు కూడా పోటీపడుతున్నారు.


వీరిలో పద్మావత్ సినిమా తీసిన సంజయ్ లీలా భన్సాలీ కూడా ఉన్నారు. ఈ మూవీకి మొదట ప్రభాస్ నే అనుకున్నాడట. ఆయన హ్యాండ్ ఇవ్వడంతో రణ్ వీర్ సింగ్ కి ఛాన్స్ వచ్చింది. ఈ విషయం రీసెంట్ గా బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది.  


కరణ్ జోహార్ బాహుబలి మూవీని బాలీవుడ్ లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు మూవీ ప్రమోషన్ కి కూడా అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఓ సినిమా ఆఫర్ చేస్తే ప్రభాస్ నో చెప్పేశాడట. కరణ్ దర్శక, నిర్మాతగా తెరకెక్కిస్తున్న తఖ్త్ మూవీ కోసం ఈ యంగ్ హీరోని సంప్రదించాడట. అయితే సెకెండ్ లీడ్ క్యారెక్టర్ కావడంతో రెబెల్ స్టార్ రిజెక్ట్ చేశాడని టాక్. ఈ మూవీ రణ్ వీర్ సింగ్, కరీనా కపూర్, అలియా భట్, జాన్వి కపూర్ వంటి స్టార్స్ తో తెరకెక్కుతోంది. 


ప్రభాస్ కి బాలీవుడ్ లో డైరెక్ట్ మూవీ చేయాలనుంది. అయితే సోలో హీరోగానే నేషనల్ లెవెల్ లో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రెజెంట్ సాహో మూవీతో ఈ హీరో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సాహో రిలీజ్ చేయబోతున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: