‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ తో టాప్ హీరోల రేంజ్ కి ఎదిగిపోతున్న విజయ్ దేవరకొండకు అభిమానులు కూడ చాల భారీ స్థాయిలో పెరిగి పోవడంతో అతడి అభిమానులు లేటెస్ట్ గా అతడి ట్యాగ్ ను ఫిక్స్ చేసారు. ‘సూపర్ పవర్ స్టార్’ అంటూ అటు మహేష్ ఇటు పవన్ ల మ్యానియాను కలుపుకుని విజయ్ అభిమానులు క్రియేట్ చేసిన ఈ ట్యాగ్ ను చూసి విజయ్ తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నిన్న ఒక మీడియా సంస్థ విజయ్ తో మాట్లాడుతూ అతడి అభిమానులు అతడికి క్రియేట్ చేసిన ట్యాగ్ ను గురించి ప్రస్తావించినప్పుడు విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తాను ఎప్పటికీ విజయ్ దేవరకొండలానే ఉంటాను కాని తనకు ఇలాంటి ట్యాగ్ లైన్స్ వద్దు అని అంటూ ఇలాంటి ట్యాగ్ లైన్స్ తనను ప్రభావితం చేయవు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
ఇదే సందర్భంలో ఆమీడియా సంస్థ ప్రతినిధి విజయ్ ను ‘బిగ్ బాస్ 3’ షో హోస్ట్ చేసే అవకాసం వస్తే అంగీకరిస్తారా ? అని అడిగినప్పుడు ఈ క్రేజీ యంగ్ హీరో ఎవరు ఊహించని సమాధానం ఇచ్చాడు. తాను ఈమధ్య ‘బిగ్ బాస్ 2’ షోకు అతిధిగా వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణం తనకు ఏమీ నచ్చలేదని అలాంటి కార్యక్రమానికి తాను ఎందుకు వెళ్ళానా అని బాధ కూడ పడ్డానని అలాంటి షోను తాను ఎలా హోస్ట్ చేస్తాను అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు విజయ్.
ఇది ఇలా ఉంటే విజయ్ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోవడంతో నిన్నటి వరకు 50 లక్షల పారితోషికంలో ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పుడు తన పారితోషికాన్ని 6 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇదే సంవత్సరం ఇతడు నటించిన ‘ట్యాక్సీవాలా’ నవంబర్ లో విడుదల కావడానికి రెడీ అవుతుంటే విక్రమ్ తో ‘ఇంకొక్కడు’ సినిమాను తీసిన ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటించిన ‘నోట’ క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతోంది. దీనినిబట్టి చూస్తుంటే ఈ సంవత్సరం అంతా విజయ్ దేవరకొండ మ్యానియా కొనసాగబోతోంది అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి..