నాగచైతన్య ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ లేటెస్ట్ రిలీజ్ డేట్ చైతూ సుధీర్ బాబుల మధ్య ఫైట్ గా మారడంతో ఈగోడవలు సమంతకు తలనొప్పిగా మారింది. సమంత నటించిన ‘ఏ మాయ చేసావె’ మూవీ విడుదలై 8 ఏళ్ళు దాటిపోయింది.
ఈమూవీలో జెస్సి పాత్రలో నటించిన సమంతకు అన్నయ్యగా సుధీర్ బాబు నటించాడు. ఆసినిమాలో నాగ చైతన్య సమంతను ప్రేమిస్తున్న విషయం తెలుసుకుని సుధీర్ బాబు ఆవిషయమై చైతూతో ఘర్షణ పడి వారిద్దరు కొట్టుకున్న సీన్ కూడ ఉంది.
అయితే ఇప్పుడు మళ్ళీ అదే సుధీర్ బాబు నాగాచైతన్యల మధ్య వారి లేటెస్ట్ సినిమాలకు సంబంధించి వినాయకచవితి పండగ వార్ జరగబోతోంది. ఇప్పటికే వాయిదా పడ్డ ‘శైలజా రెడ్డి’ మూవీ విడుదల డేట్ ను సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పటికే సుధీర్ బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ మూవీని కూడ అదే డేట్ కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో సెప్టెంబర్ 13 చైతన్య సుధీర్ బాబుల మధ్య వార్ గా మారింది.
ఈవిషయమై సుధీర్బాబు ఫన్నీగా సమంతను టార్గెట్ చేస్తూ ట్విట్ చేసాడు. “ఏళ్ళు గడిచినా జెస్సి, జెర్రీ ఫైట్ చేసుకుంటున్నారు. మా ఇద్దరి సినిమాలు సెప్టెంబర్ 13న విడుదల అవుతున్నాయి. ఆల్ ద బెస్ట్ టు సామ్” అని సుధీర్బాబు ట్విట్ చేసాడు. దీనితో వీరిద్దరి ఫైట్ తనకు తలనొప్పిగా మారింది అంటూ సమంత రిప్లై ఇచ్చింది. ఏమైనా ఈ ఇద్దరి హీరోలలో ఎవరు వినాయక చవితి హీరోగా మారుతారో చూడాలి..