నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ 16 మంది కంటెస్టంట్స్ తో మొదలవగా పది వారాల తర్వాత ఇప్పుడు కేవలం 10 మంది ఇంటి సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ వారం నలుగురు ఇంటి సభ్యులు నామినేషన్ లో ఉండగా గత రెండు రోజుల నుండి జరుగుతున్న కళ్యాణ వైభోగమే టాస్క్ ఇంటి సభ్యులంతా సక్సెస్ ఫుల్ గా చేశారు.


ఇక బిగ్ బాస్ మీద పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాలని ఉంటుంది. ఈ షో గురించి సాటి యాంకర్ కమ్ హీరోయిన్ రష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. బిగ్ బాస్ గురించి రష్మిని అడిగితే బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ కన్ఫాం అనేసింది. ఈసారి టైటిల్ కౌశల్ కే అంటూ ఆయనకు బయట కౌశల్ ఆర్మీ ఉందని అన్నది.


అంతేకాదు అప్పుడప్పుడు ట్రోలింగ్స్ చూస్తుంటే ఒకవేళ బిగ్ బా టైటిల్ విన్నర్ గా కౌశల్ కు ఇవ్వకుంటే కౌశల్ ఆర్మీ ధర్నాలు చేస్తారని కూడా చెప్పింది కౌశల్. ఓ రకంగా రష్మి కూడా కౌశల్ కే తన ఓటు అనేలా చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ మాత్రమే కాదు అందరికి ఫేవరెట్ కంటెస్టంట్ గా ఉన్నాడు కౌశల్.


మిగతా ఇంటి సభ్యులంతా ఒకటైతే అతను ఒకటి. బిగ్ బాస్ సీజన్ 2 మిగతా ఇంటి సభ్యులు ఎలా ఉన్నా టఫ్ ఫైట్ మాత్రం కౌశల్ ద్వారా ఏర్పడింది. ఇక కౌశల్ తర్వాత తనీష్, గీతా మాధురిలు కూడా ఈ షోలో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ గా ఉన్నారు. రష్మి చెప్పిన దాన్ని బట్టే కౌశల్ విన్నర్ అవుతాడా లేదా అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: