టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ..కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ అనూహ్యంగా టాప్ ప్రొడ్యూసర్ స్థాయికి చేరుకున్నారు. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ తర్వాత వెండి తెరపై కమెడియన్ గా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ పవన్ కళ్యాన్ తో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ తో ఓ రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే బండ్ల గణేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ని ఆరాధ్య దైవంగా చూస్తుంటారు.
తాజాగా నిర్మాత బండ్ల గణేష్ కుటుంబంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహా వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు భారీగా తరలివచ్చారు. బండ్ల గణేష్ సోదరుడి కుమార్తె అశ్రిత, సాయి పవన్ల వివాహం గురువారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
ఇక సినీ పరిశ్రమకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి దంపతులు, కీరవాణి దంపతులు, నిర్మాత సురేష్ బాబు, హస్యనటుడు బ్రహ్మానందం, హీరో శ్రీకాంత్ దంపతులు, హీరో గోపిచంద్, జయసుధ ఫ్యామిలీ సభ్యులు, వినాయక్, తదతరులు హాజరయ్యారు.
అంతే కాదు తెలంగాణ మంత్రులు డాక్టర్ రెడ్డి, ఈటల రాజేందర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, బొత్స సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, దానం నాగేందర్, జేసీ దివాకర్ రెడ్డి, ఎన్టీవీ అధినేత చౌదరీ, ఎంపీ కేశవరావు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.