మొదటి సినిమా అలా ఎలా ఎవరికి తెలియకున్నా సరే కుమారి 21ఎఫ్ సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ తెచ్చుకుంది హెబ్భా పటేల్. ఆ సినిమాతో అమ్మడికి యూత్ లో మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమా తర్వాత కూడా హెబ్భా తన ఫాలోవర్స్ ను సాటిస్ఫై చేసే ప్రయత్నాలు చేసింది. అయితే అవేవి అంతగా వర్క్ అవుట్ కాలేదు.


లేటెస్ట్ గా హెబ్భా పటేల్ మళ్లీ కుమారిని మించేలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఆ సినిమానే 24 కిస్సెస్. మిణుగురులు లాంటి సినిమా తీసిన అయోధ్య కుమార్ ఈసారి బోల్డ్ అటెంప్ట్ తో వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ తోనే హంగామా సృష్టించగా ట్రైలర్ తో మరింత రచ్చ చేశారు.


హెబ్భా ముద్దులతో ట్రైలర్ అంతా హాట్ హాట్ గా సాగింది. అయితే కేవలం ముద్దులే కాదు ఈ సినిమాలో మంచి కథ కూడా ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ప్లే బాయ్ గా ఆది కనిపిస్తున్నాడు. హెబ్భా పటేల్, ఆదిత్ ల లిప్ లాక్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.


కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో రావు రమేష్ పాత్ర డిఫరెంట్ గా కనిపిస్తుంది. చివర్లో అద్వైతాన్నైనా అర్ధం చేసుకోవచ్చు కాని ఆడదాన్ని అర్ధం చేసుకోలేం అని ఎస్వీఆర్ చెప్పారని రావు రమేష్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. మరి కుమార్ తర్వాత హెబ్భా ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూస్తుంటే ఈ సినిమా కూడా ఆ సినిమా రేంజ్ లో సక్సెస్ అవడం ఖాయమని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: