భారతీయ టెలివిజన్ రంగంలో ఎంతో ఆసక్తి రేపుతు కార్యక్రమం ఏదంటే బిగ్ బాస్ అనే చెబుతారు.  బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, టాలీవుడ్ ఈ సారి మాలీవుడ్ లోకి కూడా ప్రవేశించింది బిగ్ బాస్.  ప్రస్తుతం తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు నేచురల్ స్టార్ నాని.  గతంలో బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహించినప్పటికీ ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండటంతో ఎన్టీఆర్ ప్లేస్ లోకి నానీ ఎంట్రీ ఇచ్చాడు.  ఇప్పుడు బిగ్ బాస్ 2 సీజన్ వందరోజులు జరుగుతుంది. 
చికిత్స తర్వాత నూతన్ నాయుడు
ఇప్పటికే 70 రోజులు పూర్తి చేసుకుంటున్న బిగ్ బాస్ సీజన్ లో ఎన్నో వింతలు..విచిత్రాలు జరుగుతున్నాయి.  ఈ సారి బిగ్ బాస్ లోకి కామన్ మాన్ గా ముగ్గురు ఎంట్రీ ఇచ్చారు.  వారిలో సంజన, నూతన్ నాయుడు, గణేష్.  మొదటి వారం మోడల్ సంజన ఎలిమినేట్ అయ్యింది.  దాంతో బిగ్ బాస్ పై రూమర్లు రావడంతో తర్వాత ఒక్కొక్క సెలబ్రెటీలు బయటకు వెళ్తున్న సమయంలో మరో కామన్ మాన్ నూతన్ నాయుడు కూడా ఎలిమినేట్ అయ్యాడు.అయితే ఈసారి కొత్త పద్దతిలో ఆడియన్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ అయిన వారిని తిరిగి బిగ్ బాస్ లోకి తీసుకున్నారు.  
నూతన్ నాయుడు వల్లే దీప్తి బయటకు
అలా అత్యధిక ఓట్లు సంపాదించిన వారిలో యాంకర్ శ్యామల, నూతన్ నాయులు  మరోసారి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఇదిలా ఉంటూ రెండు వారాల క్రితం నూతన్ నాయుడు ఓ టాస్క్ లో భాగంగా భుజానికి గాయం కావడంతో బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లారు. దాంతో ఈసారి ఆయన రాకపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.  కానీ అందరికీ షాక్ ఇస్తూ..నూతన్ నాయుడు మూడో సారి బిగ్ బాస్ హౌజ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇలా  బిగ్ బాస్ చరిత్రలో ఒకే వ్యక్తి మూడు సార్లు ఎంట్రీ ఇవ్వడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: