ఇప్పుడు రాజకీయ వారసులు కూడా సినిమా బాట పడుతున్నారు. రాజకీయాలను , సినిమాలను వేరు చేసి చూడలేము అయితే కర్ణాటక ముఖ్య మంత్రి కొడుకు నిఖిల్ దేవెగౌడ మొదటి సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం డబ్బును మంచి నీళ్లలా ఖర్చుచేశారు. ఎవరూ ఊహించనంత ధనప్రవాహం జరిగింది ఆ సినిమా కోసం. ఆఖరి నిమిషంలో కోటి రూపాయలిచ్చి తమన్నతో ఐటెంసాంగ్ కూడా పెట్టారు.

Image result for nikhil deve gowda

ఇంత చేసినా నిఖిల్ నిలబడలేకపోయాడు. జాగ్వార్ సినిమా ఆడలేదు. ఇప్పుడీ హీరో మరో ఫ్యాన్సీ ఆఫర్ తో ముందుకొచ్చాడు.  తనను హీరోగా నిలబెట్టే మంచి కథతో ఎవరైనా స్టార్ డైరక్టర్ వస్తే అతడికి 5 కోట్ల రూపాయల చెక్ అందించేందుకు రెడీగా ఉన్నట్టు ప్రకటించాడు. ఈ ఆఫర్ కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం. అవును.. టాలీవుడ్ దర్శకులకు 5 కోట్ల రూపాయల చెక్ తో గాలం వేసే ప్రయత్నం చేస్తున్నాడు నిఖిల్ గౌడ.

Related image

ఈ హీరోకు కన్నడ చిత్రసీమలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందిలేదు. ఎందుకంటే ఇతడి తండ్రి స్వయంగా ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి. క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకోవడం నిఖిల్ కు ఇప్పుడు చిటికెలో పని. కానీ ఇతడి కన్ను టాలీవుడ్ పై ఉంది. అందుకే ఇలా క్రేజీ ఆఫర్ వదిలాడు. తెలుగులో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకే ఇదంతా. అంతా బాగానే ఉంది కానీ నిఖిల్ ఆఫర్ ను అంగీకరించే దర్శకుడు మాత్రం టాలీవుడ్ లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఓ మోస్తరు పేరు, క్రేజ్ ఉన్న దర్శకులంతా బిజీగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: