టాలీవుడ్ లో బాహుబలి లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ లో పని చేసి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో ప్రభాస్.   తెలుగులో కనీ వినీ ఎరుగని రీతిలతో అద్భుతమైన వ్యూజువల్స్ తో ఒక రాజు ఇలా ఉండాలి అన్న స్థాయిలో మెప్పించిన ప్రభాస్ ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ కోసం ఏకంగా ఐదు సంవత్సరాలు ఏ సినిమా ఒప్పుకోకుండా ఎంతో డెడికేషన్ గా వర్క్ చేశారు.  అందుకే ప్రభాస్ కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది.  దాంతో బాలీవుడ్ లో సైతం ఎన్నో ఆఫర్లు వచ్చాయి.  బాహుబలి 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని  ప్రభాస్ ‘సాహు’ సినిమాలో నటిస్తున్నాడు. 

Related image

యూవీ క్రియేషన్స్ బ్యానర్లో 'సాహో' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.  కొన్ని రోజులుగా ప్రభాస్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.  దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2019 లో విడుదల కానుంది.   ప్రస్తుతం సాహో షూటింగ్ బిజీగా సాగుతోంది. 

Image result for ప్రభాస్ సాహూ

భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టంట్ లతో ప్రభాస్ బిజీగా గడుపుతున్నాడు. ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలైన దగ్గర నుంచి, ప్రభాస్ తో పాటు ఇతర ముఖ్య పాత్రధారులకు .. సాంకేతిక నిపుణులకు ఫిల్మ్ సిటీలోనే వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారట.   ఉదయం మొదలైన షూటింగ్ నాన్ స్టాప్ గా రాత్రి వరకూ కొనసాగుతోందట.  అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకూ..ఒక్కోసారి రాత్రిదాకా సాగుతోందట.. ఇలాంటప్పుడు నటులు రోజూ సిటీనుంచి ఆరెఫ్సీ కు ప్రయాణం చేసి మళ్ళీ సాయంత్రం తిరిగి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది.

Image result for ప్రభాస్ సాహూ

 ఎందుకో తెలుసు కదా.. ఆ ట్రాఫిక్ లో ఒక రోజు అలా వెళ్తే రెండు రోజు ఇక షూటింగ్ కు వెళ్ళడానికి ఓపిక ఉండదు.  ట్రాఫిక్ సమస్యల వలన ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో, ఫిల్మ్ సిటీలోనే వుండే ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. వారానికి ఒకసారి మాత్రమే అంతా ఇళ్లకి వెళ్లి వచ్చేలా ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శ్రద్ధాకపూర్ కన్పించనున్న సంగతి తెలిసిందే.   


మరింత సమాచారం తెలుసుకోండి: