సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం సినిమాలంటే ఎంత ప్రత్యేకత ఉంటుందో అందరికీ తెలిసిందే.  ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించిన మణిరత్నం తాజాగా మరో అద్భుతానికి తెరలేపనున్నారు.  ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో అందగాడిగా పేరు తెచ్చుకొని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా కెరీర్ ప్రారంభించిన నటుడు అరవింద్ స్వామి. ఫేమస్ డైరక్టర్ మణిరత్నం ఇప్పుడు న‌వాబ్‌తో మరో థ్రిల్ ఇవ్వనున్నారు. ఆ ఫిల్మ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు.   ఉత్కంఠభరిత సన్నివేశాలతో నవాబ్ ఆకట్టుకుంటున్నది.

ఓ డాన్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మద్రాస్ టాకీస్ దీన్ని నిర్మిస్తున్నది. వరద' పాత్రలో అరవింద్ స్వామిని  'త్యాగు' పాత్రలో అరుణ్ విజయ్ ని .. 'రుద్ర' పాత్రలో శింబును .. 'రసూల్' పాత్రలో విజయ్ సేతుపతిని .. 'భూపతి' పాత్రలో ప్రకాశ్ రాజ్ ను ఈ ట్రైలర్ ద్వారా పరిచయం చేశారు. యాక్షన్ కి .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. 

సినిమా మొత్తం మాఫియా నేపథ్యంలో సాగుతన్నట్లు కనిపిస్తుంది.  ప్రతి పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేశారనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రానున్నంది.

ఈ ఫిల్మ్‌లో ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, సిలంబరసన్, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, అదితి రావ్ హైదర్, జయసుధ, అరుణ్ విజయ్‌లు నటిస్తున్నారు. తమిళంలోనూ ఈ సినిమాను చెక్కా చివంతా వనమ్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ తెలిపింది.

Image result for nawab movie trailer



మరింత సమాచారం తెలుసుకోండి: