తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 రోజు రోజుకీ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇప్పటికే 75 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఒక్కొక్కరి ఎలిమినేషన్ ఇంటి సభ్యుల మద్య కాంపిటీషన్ తెగ పెరిగిపోతుంది. ఆ మద్య బిగ్ బాస్ షో పై రక రకాల రూమర్లు..కామెంట్స్ వినిపించినా..ఇప్పుడు ఇంటి సభ్యుల మద్య ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా సాగుతుంది.
నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా నాని నిన్న బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెగ సందడి చేశారు. నానిని చూసిన వెంటనే హౌస్ సభ్యులు ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. నాని వస్తూ వస్తూ తనతోపాటు స్వీట్లు, పోటీదారుల కుటుంబ సభ్యులు పంపించిన రాఖీలు, లెటర్లు మోసుకొచ్చాడు. దీంతో హౌస్ లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇంటి సభ్యులకు గిఫ్ట్ లు ఇచ్చారు..స్వయంగా తానే పులిహోర అందరికీ వడ్డించాడు. సామ్రాట్, కౌశల్, తనీశ్ తదితరులకు ఇంటి నుంచి వచ్చిన రాఖీలను దీప్తి, గీతామాధురి తదితరులు కట్టారు. దీంతో హౌస్ ఒక్కసారిగా సెలబ్రేషన్స్ మూడ్లోకి వెళ్లిపోయింది. కాగా, తాను తీసుకొచ్చిన స్వీట్లు, పాయసం తదితర వాటిని నాని స్వయంగా వడ్డించడం విశేషం.
ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్లో కౌశల్, తనీశ్, దీప్తి నల్లమోతు, పూజా రామచంద్రన్ ఉండగా.. వీరిలో ఒక్కరు ఈరోజు హౌస్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజా రామచంద్రన్ ఎలిమినేష్ అయ్యారు. అనంతరం పూజ మాట్లాడుతూ.. ఎలిమినేట్ అయినందుకు తనకేమీ బాధగా లేదని పేర్కొంది. తాను బాగా ఎంజాయ్ చేశానని, ఆటను ఆటలాగే ఆడానని పేర్కొంది. బిగ్బాస్ హౌస్లో కౌశల్, తనీశ్ బలమైన కంటెస్టెంట్స్గా గుర్తింపు పొందారు. వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఇప్పట్లో వారు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు.