కన్నడ కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన. తెలుగులో నాగ శౌర్యతో ఛలో సినిమాలో నటించిన అమ్మడు ఆ సినిమాతో యూత్ ను ఆకట్టుకుంది. ఇక ఈమధ్య వచ్చిన గీతా గోవిందం సినిమాతో అమ్మడు మరింత క్రేజ్ సంపాదించింది. రెండు వరుస సినిమాలు హిట్లు కొట్టడంతో రష్మిక కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.


ప్రస్తుతం దేవదాస్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న రష్మిక దానితో పాటుగా మరోసారి విజయ్ తో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది. హిట్ పెయిర్ కాబట్టి విజయ్, రష్మికల డియర్ కామ్రేడ్ కూడా భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఎలాగు తనకంటూ ఓ ఇమేజ్ వచ్చింది కాబట్టి అమ్మడు తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుందట రష్మిక.


ఆ ప్రయత్నంలోనే నాగార్జున, నానిలు కలిసి చేస్తున్న దేవదాస్ సినిమా కోసం సొంత డబ్బింగ్ చెబుతుందట రష్మిక. తెలుగు నేర్చుకుని తెలుగులో డబ్బింగ్ చెప్పడం మంచిదే అయినా ఎందుకు రష్మిక ఇంతలోనే అంత రిస్క్ చేస్తుంది అని అందరు షాక్ అవుతున్నారు. అయితే అమ్మడికి ఎలాగు ఇక్కడ క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కొంతకాలం హవా కొనసాగించాలని డిసైడ్ అయ్యింది. అందుకే సొంత డబ్బింగ్ కూడా చెబుతుందని అంటున్నారు.


ఈమధ్య టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత మరింత పెరిగింది. అందుకే లక్కీ హీరోయిన్ అనిపించిన భామలకు కోరినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరి సినిమాలు చేస్తున్నారు. చూస్తుంటే రష్మిక కన్నడ సినిమాలను వదిలేసి తెలుగులోనే స్టార్ హీరోయిన్ గా అవతరించబోతుందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: