తెలుగు ఇండస్ట్రీలో ‘రైడ్’ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోలు నానీ, తనిష్.  తర్వాత నానీ వరుసగా విజయాలు సాధిస్తూ..తన కెరీర్ లో ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు.  ఇక బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన తనిష్ హీరోగా మారిన తర్వాత సరైన హిట్ లేక నానా అవస్థలు పడుతున్నాడు.  సైడ్ క్యారెక్టర్లు కూడా పెద్దగా రాకపోవడంతో ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న తనిష్ ని నాని పలు మార్లు ఆదుకున్నట్లు ఆ మద్య ఓ విషయంలో తనిష్ స్వయంగా తెలిపాడు.  ప్రస్తుతం తెలుగు లో బిగ్ బాస్ షో సీజన్ 2 నడుస్తున్న విషయం తెలిసిందే. 


 గతంలో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ కాగా..ఈసారి బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  అయితే నానికి ఉన్న పరిచయడంతో తనిష్ బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ మరో మూడు వారాలు మాత్రమే ఉంది.. ఇప్పుడు హౌస్ లో తిరిగొచ్చిన నూతన్ నాయుడితో కలిసి మొత్తం 11 మంది సభ్యులున్నారు. ఫైనల్ చివరి వారంలో ఐదుగురు కంటెస్టెంట్లు ఉండాలి.  ఈ లేక్కన ప్రతి వారం కనీసం ఇద్దరు ఎలిమినేట్ అవుతూ ఉండాలి..లేదా ముగ్గురు అవుతూ ఉండాలి.  

Bigg Boss 2 Telugu,Bigg Boss Telugu season 2,Bigg Boss Telugu 2

ఈ నేపథ్యంలో ఈ ఆదివారం కూడా ఇద్దరు వెళ్లిపోవాల్సి ఉండేది. కానీ కావాలనే తనీష్ ను సేవ్ చేయడం కోసం ఎలిమినేషన్ లో ఒక్కరికే బయటకు పంపారనే ప్రచారం తాజాగా సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ లో కౌశల్, తనిష్, దీప్తి, పూజ లు ఉన్నారు.  వారిలో కౌశల్ కి అత్యధిక ఓట్లు రాగా, దీప్తికి రెండో స్థానం, తనిష్ కి మూడో స్థానం రాగా పూజికు అతి తక్కువ ఓట్లు వచ్చాయి.  దాంతో పూజా రామచంద్రన్ ఎలిమేన్ అయ్యింది.  

Bigg Boss Telugu 2: Pooja Ramachandran gets evicted, Nani celebrates Rakshabandhan with contestants and all about the latest episode

అయితే మూడో స్థానంలో ఉన్న తనిష్ ఖచ్చితంగా ఔట్ కావాల్సి ఉన్న ఎదో ఒక అభయ హస్తం అతన్ని సేవ్ చేసిందని టాక్ వినిపిస్తుంది.  ఇప్పుడున్న బిగ్ బాస్ హౌస్ లో బలమైన కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారంటే అది కౌశల్ రెండో ప్లేసులో తనీష్.. వీరిద్దరూ ఆది నుంచి గొడవపడుతూ బిగ్ బాస్ కు కావాల్సిన మసాలా యాడ్ చేస్తున్నారు. మరో మూడు వారాలుండగా.. ప్రస్తుతం పది మంది ఉన్నారు. రాబోయే రెండు వారాలు డబుల్ ఎలిమినేష్ చేస్తే ఆరుగురు ఉంటారు. మరి ఫైనల్ కి ఎవరు చేరుతారో అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: