టాలీవుడ్ లో మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ.  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇడియట్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రవితేజ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మాస్ మహరాజు గా గుర్తింపు తెచ్చుకున్నాడు.  అయితే పవర్ సినిమా తర్వాత కిక్ 2, బెంగాల్ టైగర్ ఇలా వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో రవితేజ కెరీర్ పీక్ స్టేజ్ లోకి  వెళ్లిపోయింది.  దాంతో రవితేజ ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతున్నాడని ప్రచారం మొదలైంది..దానికి తోడు రవితేజ కూడా రెండు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాడు. 
Image result for అమర్ అక్బర్ ఆంథోని
కానీ ఆ రూమర్స్ ని బ్రేక్ చేస్తూ..గత సంవత్సరం ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మరోసారి తన పవర్ ఏంటో చూపించాడు రవితేజ.  ఈ సినిమా లో పూర్తిగా అంధుడిగా నటించి హీరోయిజాన్ని చూపించాడు.  దాంతో మాస్ రాజా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ సంతోష పడిపోయారు.  కాకపోతే ఈ సినిమా తర్వాత రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’, ‘నేట టిక్కెట్టు’ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  దాంతో రవితేజకు మరో సూపర్ హిట్ అవసరం.  ఇండస్ట్రీలో వరుసగా ఫెయిలుర్స్ చవిచూస్తున్న దర్శకులు శ్రీనువైట్ల కు ఇప్పుడు మంచి హిట్ అవసరం. 
Image result for అమర్ అక్బర్ ఆంథోని
తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా తెరకెక్కుతుంది.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దుబాయ్ శీను సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలసిందే. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత గోవా బ్యూటీ ఇలియానా తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్, సి.వి.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీను వైట్ల-రవితేజ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రమిది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

అంతే కాదు మొట్టమొదటిసారి రవితేజ మల్టిపుల్ షేడ్స్‌లో కనిపించడం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ఈ సినిమాలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ ఆరోరా, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరికొత్త కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతోంది.  సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: