‘సమ్మోహనం’ సక్సస్ తో కెరియర్ పరంగా కొంతవరకు కుదుట పడ్డ సుధీర్ బాబు నిర్మాతగా మారి నిర్మిస్తున్న ‘నన్ను దోచుకుందువటే’ మూవీ సక్సస్ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈసినిమాకు ఎటువంటి పోటీ లేకుండా విడుదల చేయాలని వినాయకచవితి పండుగను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 13న తన మూవీ రిలీజ్ డేట్ గా ఇప్పటికే లాక్ చేసాడు.
అయితే ఈ సూపర్ స్టార్ బావమరిదిని రెండువైపులా నాగచైతన్య సమంతలు కలిసికట్టుగా దాడి చేయడం హాట్ న్యూస్ గా మారింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీని సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నట్లు లీకులు ఇస్తున్నారు. ఇది చాలదు అన్నట్లుగా సమంత నటించిన ‘యూటర్న్’ మూవీ రిలీజ్ ను సెప్టెంబర్ 13న ఖాయం చేస్తూ ప్రకటన కూడ ఇచ్చారు. దీనితో చైతు సమంతల సినిమా వార్ కు రంగం సిద్ధం అయింది. వాస్తవానికి సమంత ‘యూటర్న్’ మూవీ ఇంత హడావిడిగా రిలీజ్ కావడానికి ఒక సెంటిమెంట్ ఉంది అని టాక్.
థ్రిల్లర్ మూవీలు ఏనెలలో అయినా ముఖ్యంగా సెప్టెంబర్ 13న విడుదల అయితే అవి హిట్ అవుతాయని ఇండస్ట్రీ వర్గాలలో సెంటిమెంట్. దీనికితోడు ఈమూవీని తెలుగు తమిళ భాషలలో విడుదల చేస్తున్న నేపధ్యంలో కోలీవుడ్ ఫిలిం ఛాంబర్ సమంత ‘యూటర్న్’ కు సెప్టెంబర్ 13వ తేదీని అధికారికంగా ఎలాట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 13 రేస్ లో సమంత ‘యూటర్న్’ రావడం ఖాయం.
ఇప్పటికే ఇదే డేట్ పై నాగచైతన్య కన్ను పడటంతో ఒకేరోజు నిజజీవితంలో భార్యాభర్తలు నటించిన సినిమాలు ఒక దాని పై ఒకటి పోటీ పడటం ఇండస్ట్రీ రికార్డ్ గా మారింది. ఈ మధ్యలో ఎప్పటి నుంచో ఇదే డేట్ పై దృష్టి పెట్టుకున్న సుధీర్ బాబు రంగంలో ఉండటంతో ఇప్పుడు వినాయకచవితి మూవీల వార్ చైతూ సమంత సుధీర్ బాబుల వార్ గా మారింది. దీనితో ఈముగ్గురిలో ఎవరికోసం ఎవరు త్యాగాలు చేస్తారు అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది..