తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ‘సంతోషం అవార్డు’వేడుక జరుగుతుంది.  తాజాగా ఈ వేడుకలో పాల్గొన్న ఎస్. జానకమ్మకు జీవిత సాఫల్యం అవార్డు కేవసం చేసుకున్నారు. ఈ అవార్డు ఆమె మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు.  ఈ సందర్బంగా జానకమ్మ మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. చిరంజీవి క‌ళ్లల్లో ఏదో మాయ ఉందని ఆ మాయకు ఎవ్వరైనా ఇట్టే ఆకర్షితులు అవుతారు.  చిరంజీవి ఎదురుగా నిల్చుంటే..ఎవరైనా అతనిని అభిమానించకుండా ఉండలేరు. 

నట‌న‌, డాన్సు, ఫైట్లు ఇలా ప్రతి విష‌యంలోనూ ఆయ‌న ప్రత్యేకమేనని కొనియాడారు. ఆయన ఒంట్లో ఎన‌ర్జీ ఉందని అన్నారు. అంతేందుకు..చిరంజీవిని చూస్తే.. ఆయ‌న వెంట ఎవ‌రైనా ప‌డాల్సిందే (సినిమాల్లో) అన్నారు న‌వ్వుతూ అన్నారు.  ఖైదీ నంబర్ 150’లో నటనకు గాను చిరంజీవికి ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఎస్ జానకి చేతుల మీదుగా ఈ అవార్డును చిరంజీవి అందుకున్నారు. అలాగే ఎస్ జానకికి జీవిత సాఫల్య పురస్కారాన్ని చిరంజీవి అందజేశారు.

చిరంజీవి 125 ఏళ్లు సంతోషంగా జీవించాలని గాయని జానకి ఆకాక్షించారు. ‘చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబ‌ర్ 150 సినిమా చూసా. పాత చిరంజీవిని చూసిన‌ట్లే ఉంది. ప్రస్తుతం ఆయన న‌టిస్తున్న సైరా న‌ర‌సింహారెడ్డి కూడా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా’ అని జానకమ్మ అన్నారు. సంతోషం అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో చిరంజీవిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. మెగాస్టార్‌కు చాలా సినిమాల్లో పాట‌లు పాడానని, నాటి హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు తనవేనని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: