ఆ మద్య మెగా ఫ్యామిలీలో ఎన్నో గొడవలు జరిగాయని..ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాన్ మద్య విభేదాలు వచ్చాయని వార్తలు తెగ హల్ చల్ చేశాయి.  కానీ అవన్నీ ఒట్టి రూమర్లు అంటూ ఇద్దరు అన్నదమ్ములు కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  ఆ మద్యసర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సెట్స్ లోకి చిరంజీవి వచ్చి జోష్ నింపారు.  తాజాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి దిగ్గజాలు నటిస్తున్నారు. 

Image result for SAIRA NARASIMHA REDDY

 ‘మెగాస్టార్’ తనయుడు హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.  ‘సైరా’లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా నటిస్తున్నాడనే వార్తలతో ‘మెగా’ అభిమానుల ఆనందం అంతాఇంతా కాదు.   ‘సైరా’ సెట్ కు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్, చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ప్రముఖ రచయిత సత్యానంద్ ఉన్నారు.


పవన్‌కి ఇష్టమైన ఇద్దరు నటులు అమితాబ్‌. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిరు తనయుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.సైరా’ చిత్రీకరణ కోసం అమితాబ్‌ గతంలో హైదరాబాద్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్‌ సెట్స్‌కి వెళ్లి అన్నయ్యతో, అభిమాన నటుడితో కలిసి ఫొటో దిగారు. కాస్త ఆలస్యంగా ఈ ఫొటో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది!ఇన్ని రోజుల తర్వాత ఆ ఫొటోను సత్యానంద్ పోస్ట్ చేయడంతో దాన్ని చూసిన ‘మెగా’ అభిమానులు సంబరపడిపోతూ, దీనిని వైరల్  చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: